Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News India Pakistan Tensions Pakistan Will Beg If War Breaks Out Moodys Report

India-Pakistan tensions: యుద్ధం వస్తే పాకిస్తాన్‌ ‘‘అడుక్కు తినడమే’’.. మూడీస్ నివేదిక..

Published Date :May 6, 2025 , 7:02 pm
By Venu Goapl Reddy
  • యుద్ధం వస్తే పాకిస్తాన్‌ పరిస్థితి అడుక్కు తినడమే..
  • పాక్‌తో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది..
  • పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై మూడీస్ నివేదిక..
India-Pakistan tensions: యుద్ధం వస్తే పాకిస్తాన్‌ ‘‘అడుక్కు తినడమే’’.. మూడీస్ నివేదిక..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-Pakistan tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. భారత్‌తో యుద్ధానికి మేము సిద్ధమని, మా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ప్రభుత్వంలోని మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నిజానికి యుద్ధం వస్తే పాకిస్తాన్ వద్ద 4 రోజులకు సరిపోయే మందుగుండు సామాగ్రి మాత్రమే ఉందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు, ఆర్థిక సంక్షోభం, అప్పుల కుప్పగా మారిన పాకిస్తాన్ పదే పదే యుద్ధ భాష మాట్లాడుతోంది.

యుద్ధానికి వెళ్తే పాక్ పరిస్థితి అడుక్కోవడమే..

Also Read

  • Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
  • DJ Sound: డీజే సౌండ్‌కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
  • Tamil Nadu: విజయ్‌తో టచ్‌లోకి అన్నాడీఎంకే..
  • End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?

తాజాగా, మూడీస్ రేటింగ్స్ సంస్థ సంచలన నివేదిక పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో చెప్పింది. భారత్‌తో యుద్ధం చేస్తే పాకిస్తాన్ ‌కి ఇక ‘‘భిక్షాటన’’ గతి అవుతుందని, పాక్ చేతిలో ఖాళీ బొచ్చే మాత్రమే ఉంటుందని పరోక్షంగా వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఈ ఉద్రిక్తత చాలా కాలం పాటు కొనసాగితే, పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుందని, దాని ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని మూడీస్ తెలిపింది. ఇది ప్రభుత్వ ఆర్థిక ఏకీకరణ ప్రక్రియను దెబ్బతీస్తుందని, ఇది పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వానికి పెద్దా ముప్పుగా మారుతుందని వెల్లడించింది.

ప్రస్తుతం ఉద్రిక్తత పాకిస్తాన్ బాహ్య నిధులను పొందే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని మూడీస్ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో దాని బాహ్య రుణాలు చెల్లిచండానికి విదేశీ మారక నిల్వలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ రుణాలు పొందడం కూడా పాక్‌కి కష్టమవుతుందని చెప్పింది. ఇటీవల కాలంలో పాక్ ఆర్థిక వ్యవస్థలో కొంత మెరుగుదల కనిపించినట్లు మూడీస్ చెప్పింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, జీడీపీ నెమ్మదిగా పెరగడం, ఐఎంఎఫ్ షరతులకు అనుగుణంగా ఉండటం కొంత ఉపశమనాన్ని అందించాయని చెప్పింది. కానీ ప్రాంతీయంగా అశాంతి, ఉద్రిక్తత పెరిగితే మెరుగుదల స్థిరంగా ఉండదని చెప్పింది.

భారత్ బలంగా ఉంది:

ఇక భారత్ విషయాని కూడా మూడీస్ ప్రస్తావించింది. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని మూడీస్ నివేదిక చెప్పింది. భారత వృద్ధి రేటు స్థిరంగా ఉందని, ప్రభుత్వం పెట్టుబడులు పెరగడంతో పాటు దేశీయ మార్కెట్లో బలమైన వినియోగదారుల వ్యయం కనిపిస్తోందని చెప్పింది. ఇక పాకిస్తాన్‌తో భారత్ వాణిజ్యం తక్కువగా ఉంది కాబట్టి ఇది భారత్ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపించదని చెప్పింది. సరిహద్దు ఉద్రిక్తత పెరిగితే, రక్షణ వ్యయం మరింతగా పెరుగుతుందని, సైనిక ఖర్చు పెంచాల్సి వస్తుందని భారత్ గురించి మూడీస్ చెప్పింది. అయితే, ఇది భారత ఆర్థిక స్థిరత్వంపై స్వల్ప ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పింది. మొత్తం మీద భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india pakistan war news
  • India-Pakistan
  • india-pakistan border
  • India-Pakistan Tensions
  • India-Pakistan War

తాజావార్తలు

  • Mamata Banerjee: “ఇక మనం జాగ్రత్తగా ఉండాలి”.. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!

  • Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..

  • Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..

  • DJ Sound: డీజే సౌండ్‌కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..

  • Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్‌కు బిగ్ షాక్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions