Karnataka: డబ్బాలో డబ్బు.. తీసి చూస్తే ఉప్పు.. ఏం ఐడియా సర్ జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: మాటలతో మయా చేస్తూ ప్రజలను మభ్యపెట్టి దొరికినకాడికి దోచుకుంటున్నారు కేటుగాళ్లు.. తెలిసిన వాళ్ళనైనా, సొంత బంధువులనైనా సరే గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు అని నమ్మబలికి కేటుగాళ్లు ప్రజలను మోసం చేసిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. డబ్బాలో ఉప్పు పెట్టి డబ్బులు ఉన్నాయని మోసం చేస్తూ పడ్డుబడ్డాడు ఓ వ్యక్తి.. వివరాలలోకి వెళ్తే.. తిప్పూరు నగరానికి చెందిన బాబా అనే వ్యక్తికి ప్రముఖులతో, రాజకీయ నాయకులతో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. దీనితో ఆయనకు ఉన్న పలుకుబడిని ప్రజలను మోసం చేయడానికి వినియోగించారు. తక్కువ వడ్డీకి డబ్బులు ఇపిస్తానని చెప్పి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఇతను అప్పు తీసుకునే వ్యక్తికి అప్పు ఇచ్చేవ్యక్తికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేవాడు.
Read also:Vizag Steel Plant: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ.. ఉక్కు ఉద్యమానికి 1000 రోజులు
Also Read
- Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
- Prahlad Joshi: ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు.. ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానం
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
కాగా అప్పు కావాల్సిన వ్యక్తికి డబ్బులు అందిస్తాను అని చెప్పి ఫైనాషియర్ దగ్గర డబ్బులు తీసుకునే వాడు.అనంతరం ఓ డబ్బాని ఉప్పు కాగితాలతో నింపి పైన కొన్ని కరెన్సీ నోట్లు పెట్టి అప్పు తీసుకునే వ్యక్తులని మోసం చేసాడు. తాజాగా గిరీష్ అనే వ్యక్తికి తక్కువ వడ్డీకి రూ/ కోటి రుణం ఇప్పిస్తానని చెప్పాడు. అలానే రూ/2.5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అలానే రాజేష్ జాతవ్ అనే అతనికి కూడా ఇలానే చెప్పి రూ/ 30 వేలు అడ్వాన్స్ ఇచ్చారు . కాగా మిగిలిన డబులు శివమొగ్గ రైల్వే స్టేషన్ దగ్గర ఇస్తాను అని చెప్పారు. ఈ నేపథ్యంలో గిరీష్, రాజేష్ జాతవ్ శివమొగ్గ రైల్వే స్టేషన్కు వచ్చారు. కాగా వాళ్లకు బాబా ఉప్పు, కాగితం, డబ్బుతో నింపిన రెండు పెట్టెలు తెచ్చి ఇద్దరికి ఇచ్చి ఒక్కో బాక్స్ లో కోటి రూపాయలు ఉన్నాయని చెప్పారు.
Read also:South Central Railway: ట్రైన్లలో టపాసులు తీసుకెళ్తే జైలు శిక్ష.. సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరిక
గిరీష్, రాజేష్ అక్కడే బాక్స్ ఓపెన్ చేసి చూడగా పైన కరెన్సీ నోట్లు ఉన్నాయి. దానితో వాళ్లకు ఎలాంటి అనుమానం రాలేదు. అయితే తరువాత మొత్తం తీసి చూడగా ఇద్దరు కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు బాబాను ఆ బాక్స్ లు రైల్వే స్టేషన్ కి తెచ్చిన బాబా డ్రైవర్ జబీవుల్లాను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Anahat Singh: భారత స్క్వాష్లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం
-
ICC T20 Rankings: ఇంగ్లాండ్కు చెక్.. సిరీస్తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
-
RC17 Update: RC17పై బిగ్ అప్డేట్.. స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
-
Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!