Vizag Steel Plant: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ.. ఉక్కు ఉద్యమానికి 1000 రోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహార దీక్షలు ఇవాళ్టికి 1000 రోజులకు చేరుకుంది. స్టీల్ ప్లాంట్ను 100 శాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉక్కు కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పలు రకాలుగా నిరసనలు నిర్వహించింది. ఢిల్లీలో రెండు రోజులు ధర్నాలు చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారిని రెండు రోజుల పాటు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దిగ్భందించారు.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
ఇప్పటికే పలు సార్లు కార్మికులు స్టీల్ప్లాంట్ పరిపాలన భవనంతో పాటు గేట్లను ముట్టడి చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని చెప్పడంతో.. అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలకు చెందిన వారు మద్దతిస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. ఈ దీక్షలు ప్రారంభించి నేటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇవాళ వివిధ రూపాల్లో ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నారు.
Read Also: Raja Singh: మోడీ సభకు రాజాసింగ్ డుమ్మా.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే
ఇక, దీక్షలు ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా నేడు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయనున్నారు. అదే విధంగా కాలేజీలు, స్కూల్స్ బంద్ చేయాలని ఉక్కు పోరాట కమిటీ నేతలు కోరారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ దీక్ష శిబిరం దగ్గరకు స్టీల్ కార్మిక సంఘ నేతలు ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాం అని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!