Vizag Steel Plant: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ.. ఉక్కు ఉద్యమానికి 1000 రోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహార దీక్షలు ఇవాళ్టికి 1000 రోజులకు చేరుకుంది. స్టీల్ ప్లాంట్ను 100 శాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉక్కు కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పలు రకాలుగా నిరసనలు నిర్వహించింది. ఢిల్లీలో రెండు రోజులు ధర్నాలు చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారిని రెండు రోజుల పాటు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దిగ్భందించారు.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఇప్పటికే పలు సార్లు కార్మికులు స్టీల్ప్లాంట్ పరిపాలన భవనంతో పాటు గేట్లను ముట్టడి చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని చెప్పడంతో.. అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలకు చెందిన వారు మద్దతిస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. ఈ దీక్షలు ప్రారంభించి నేటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇవాళ వివిధ రూపాల్లో ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నారు.
Read Also: Raja Singh: మోడీ సభకు రాజాసింగ్ డుమ్మా.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే
ఇక, దీక్షలు ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా నేడు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయనున్నారు. అదే విధంగా కాలేజీలు, స్కూల్స్ బంద్ చేయాలని ఉక్కు పోరాట కమిటీ నేతలు కోరారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ దీక్ష శిబిరం దగ్గరకు స్టీల్ కార్మిక సంఘ నేతలు ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాం అని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?