Bangladesh: 50 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కి పాకిస్తాన్ సైన్యం.. భారత్కి ముప్పు..
- 50 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కి పాకిస్తాన్ సైన్యం..
- బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వనున్న పాక్ ఆర్మీ..
- బంగ్లాలో పెరుగుతున్న భారత వ్యతిరేకత..
- రానున్న రోజుల్లో ముప్పుగా మారే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి శత్రువుగా మారింది. అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్కి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైతే షేక్ హసీనా పదవీ నుంచి దించేసి, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. హిందువులపై అరాచకాలు చేస్తూ, మరో పాకిస్తాన్గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే, దాదాపుగా 50 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్లోకి అడుగుపెడుతోంది. ఈ పరిణామం భారత్కి ఆందోళనకరం. ఇటీవల కాలంలో అన్నీ మరిచిపోయి బంగ్లాదేశ్, పాకిస్తాన్లు స్నేహాన్ని పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 2025 నాటికి, పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. 1971 లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ సైన్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి.
Also Read
పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ సైన్యాల మధ్య సహకారం కోసం ఒప్పందం కుదిరినట్లు నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ కంటోన్మెంట్ నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. నాలుగు కంటోన్మెంట్లలో కూడా పాక్ ఆర్మీ శిక్షణ ఇవ్వబోతోంది.
Read Also: Naga Vamsi : నాగవంశీపై స్కామ్ 1992 డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
భారత్ ఆందోళన ఏమిటి..?
బంగ్లాదేశ్లోకి పాకిస్తాన్ చొచ్చుకువస్తోంది. గతంలో పాకిస్తాన్ నౌకలపై ఉన్న ఆంక్షలను యూనస్ ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో యథేచ్చగా పాక్ నౌకలు బంగ్లాలోకి రావొచ్చు. ఇటీవల కరాచీ నుంచి చిట్టగాంగ్ రేపుకు పాక్ నుంచి కార్గో నౌకలు వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి ఆయుధాల కొనుగోలుని వేగవంతం చేసింది.
ఇవన్నీ చూస్తే, బంగ్లాదేశ్ టార్గెట్ భారత్ అని తెలుస్తోంది. దీనికి తోడు బంగ్లాదేశ్లో పాక్ ప్రమేయం పెరిగితే భారత ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాద, వేర్పాటువాద శక్తులకు ఆర్థిక, ఆయుధ సాయం దక్కే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకతను పాకిస్తాన్ రెచ్చగొడుతుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో తిరుగుబాటుని పాక్ దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తే బంగ్లాదేశ్ని ఉపయోగించుకుని భారత్ని అస్థిరపరిచే కుట్రకు పాకిస్తాన్ తెరతీస్తోందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?