IMD warning: ఐఎండీ వార్నింగ్.. ఈ రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక
- ఐఎండీ వార్నింగ్
- ఈ రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వామ్మో.. దేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. మొన్నటిదాకా వర్షాలు.. ఇప్పుడేమో చలి ఠారెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా చలి తీవ్రత గజగజవణికిస్తోంది. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఉదయాన్నే ఉద్యోగులకు వెళ్లేవారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాళ్లు.. చేతులు వణికిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో చలి పులిపై తాజాగా కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: India-US: ఎల్పీజీపై అమెరికాతో భారత్ కీలక ఒప్పందం.. ధరలు తగ్గే అవకాశం!
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
దేశంలో ఆయా రాష్ట్రాల్లో చలి గాలులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. మధ్య, పశ్చిమ భారతదేశంలో తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్లో చాలా తీవ్రంగా ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక దక్షిణాదిలో వర్షాలతో పాటు చలి గాలులు కూడా ఉంటాయని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో తీవ్ర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. విపరీతమైన చలిగాలులు ఉంటాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: బ్లాస్ట్కు ముందు 2 కీలక ఫోన్లు మిస్సింగ్.. ఉమర్ ఎవరికిచ్చాడు? పూర్తి డేటా వచ్చేసింది
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో నవంబర్ 17 నుంచి 19 మధ్య ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతాయని పేర్కొంది. ఇక సోమవారం పశ్చిమ మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు నమోదైంది. దేశంలోనే అత్యంత చలి ప్రాంతం ఇదేనని తెలిపింది. ఇక ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్లో కూడా తీవ్ర పరిస్థితులు ఉంటాయని చెప్పింది.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, అండమాన్ మరియు నికోబార్ దీవులలో తేలికపాటి నుంచి మితమైన వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది నవంబర్ 18 నుంచి 22 వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని.. నవంబర్ 17న అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. నవంబర్ 20 వరకు తమిళనాడు, కేరళ, మాహే, కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలో కూడా చలి గాలులు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.
ఇక నవంబర్ 17న కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, నవంబర్ 18న అండమాన్ సముద్రం మీదుగా గాలులు గంటకు 60 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తాజావార్తలు
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్లో విజయ్ స్పెషల్ హగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!