PM Modi: ‘‘భాషాభిమానం ఉంటే తమిళంలో సంతకం చేయండి’’.. స్టాలిన్పై ప్రధాని మోడీ ఫైర్..
- తమిళ నాయకులు తమిళంలో సంతకం చేయడం లేదు..
- భాషాభిమానం ఉంటే తమిళంలో సంతకం చేయాలన్న మోడీ..
- సీఎం స్టాలిన్పై పరోక్షంగా విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: హిందీ, తమిళ భాషా వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం స్టాలిన్ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల లేఖలు వచ్చాయని, వారిలో ఎవరూ కూడా తమిళంలో సంతకం చేయలేదని ప్రధాని మోడీ అన్నారు. వారు తమ భాష పట్ల నిజంగా గర్వపడితే, కనీసం తమిళంలో అయినా తమ పేర్లను సంతకంగా చేయాలని కోరారు.
‘‘తమిళ భాష, తమిళ వారసత్వం ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కొన్నిసార్లు తమిళనాడు నేతలు రాసే లేఖల్లో తమిళంలో సంతకం ఉండకపోవడాన్ని చూసి నేనే ఆశ్చర్యపోతాను. వారిలో ఎవరూ తమిళంలో సంతకం చేయరు. మనం తమిళం గురించి గర్వపడితే, ప్రతీ ఒక్కరూ కనీసం తమిళంలో సంతకం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని రామేశ్వరంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు.
Also Read
- TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
Read Also: Gujarat: ఫ్రెండ్కి లిఫ్ట్ ఇవ్వడంపై మందలించిన తల్లి.. 16 ఏళ్ల బాలిక సూసైడ్..
కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య జాతీయ విద్యా విధానం(NEP)లోని త్రిభాషా సూత్రం వివాదంగా మారిన నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అధికార డీఎంకే నేతలతో పాటు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్రం హిందీని తమిళనాడుపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. కేంద్రం తమిళ భాష, సంస్కృతిని బెదిరిస్తోందని వాదించాడు. ఈ నేపథ్యంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పేద కుటుంబాల పిల్లలు కూడా వైద్యులు కావాలనే వారి కలను నెరవేర్చడానికి తమిళనాడు ప్రభుత్వాన్ని తమిళ భాషలో వైద్య కోర్సులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని మోడీ కోరారు. మన దేశ యువత వైద్యులు కావడానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసుకునే మా ప్రయత్నమని, గత 10 ఏళ్లలో తమిళనాడుకు 11 కొత్త వైద్య కళాశాలలు వచ్చాయని మోడీ అన్నారు.
తమిళనాడు కొత్త విద్యా విధానాన్ని అంగీకరించకపోవడంతో రూ. 2000 కోట్ల నిధులు నిలిచిపోయాయని అధికార డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. అయితే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు అందించే నిధులు పెరిగాయని, తమిళనాడు అనేక కేంద్ర పథకాల నుంచి ప్రయోజనం పొందిందని మోడీ అన్నారు. గత దశాబ్దంలో రాష్ట్ర రైల్వేకి బడ్జెట్ ఏడు రెట్లు పెరిగిందని ప్రధాని చెప్పారు. 2014కి ముందు ప్రతీ ఏడాది తమిళనాడుకు రూ. 900 కోట్లు మాత్రమే కేటాయించారని, అయితే, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్కి రూ. 6000 కోట్లు దాటిందని, అదనంగా రామేశ్వరంలో స్టేషన్తో సహా 77 రైల్వే స్టేషన్లను అనుకరిస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!