CM Nitish Kumar: అధికారి కాళ్లు పట్టుకోబోయిన సీఎం నితీష్ కుమార్.. వీడియో వైరల్..
- అధికారి కాళ్లకు నమస్కరిస్తాన్న సీఎం నితీష్ కుమార్..
- ప్రాజెక్టులు తర్వగా పూర్తి చేయాలని విజ్ఞప్తి..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ వార్తల్లో వ్యక్తిగా మారారు. మౌలిక సదుపాయాల పనుల్ని వేగవంతం చేయాలని కోరుతూ, నితీష్ చేతులు జోడించి వేడుకోవడం వైరల్గా మారింది. బీహార్లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం తన సీటు నుంచి లేచి, ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ చేతులు జోడించి ఐఏఎస్ అధికారి వైపు వెళ్లారు. ఆ ఐఏఎస్ అధికారి రాష్ట్ర అదనపు హోం కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రత్యయ అమృత్.
రాజధాని పాట్నాలో కంగన్ ఘాట్ వరకు జేపీ గంగా మార్గ్ పొడగింపును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం పాట్నాలో పర్యటించారు. త్వరతగతిన గంగా మార్గాన్ని విస్తరించేందుకు అధికారులు వేగవంతంగా పనిచేయాలని కోరారు. నితీష్ కుమార్ హఠాత్తుగా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే నీ పాదాలను తాకుతానని వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారి ప్రత్యయ అమృత్కి నమస్కరించి పాదాలను తాకినట్లు సైగ చేశాడు. అవాక్కయిన ప్రత్యయ అమృత్ చేతులు ముడుచుకుని ఆపడానికి ప్రయత్నించాడు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: Swati Maliwal Case: బిభవ్ కుమార్ బెయిల్పై హైకోర్టు తీర్పు రిజర్వ్
బీహార్లో వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు భారీ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నితీష్ కుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. బీపీ గంగా మార్గ్ పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరుతున్నారు. గతేడాది ఈ ప్రాజెక్టు రెండో దశను సీఎం ప్రారంభించారు. అక్టోబర్ 11,2013న జయ ప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా నితీష్ కుమార్ జేపీ గంగా మార్గానికి శంకుస్థాపన చేశారు.
ఇప్పటికే వరసగా వంతెనలు కూలిపోతున్న క్రమంలో ఎన్నికల లోపు భారీ ప్రాజెక్టులను పూర్తి చేసి, ఎన్నికలకు వెళ్లాలని నితీష్ కుమార్ భావిస్తున్నారు. మూడు వారాల్లో బీహార్లోని 13 వంతెనలు కూలిపోయాయి. వరస ఘటనలతో ప్రభుత్వం 15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలను సర్వే చేసి తక్షణ మరమ్మతులు చేయాలని నితీష్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు.
- Tags
- bihar
- ias officer
- nitish kumar
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!