Arvind Kejriwal: కాంగ్రెస్- బీజేపీ మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడుతున్నాయి..
- కాంగ్రెస్- బీజేపీ మధ్య బంధం బయటపడుతుంది..
- రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దు..
- కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారు: కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు బీజేపీ సీనియర్ నేత, అమిత్ మాలవీయ దేశం గురించి తర్వాత ఆలోచించండి.. ముందు మీ సీటును కాపాడుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఈ రెండు పార్టీల మధ్య అనుబంధాన్ని ఢిల్లీ ఎన్నికలు బహిర్గతం చేస్తాయన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి రాహుల్ యత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాను దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నా.. తనపై అతడు చేసిన విమర్శలను పట్టించుకోనని కేజ్రీవాల్ వెల్లడించారు.
Read Also: Piyush Goyal: 40 రైతుల ఏళ్ల కల నెరవేరింది.. ఈ ఘనత వాళ్లదే..
Also Read
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
- Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీలంపుర్లో సోమవారం నాడు జరిగిన జై బాపు, జై భీం, జై సంవిధాన్’ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆప్ సర్కార్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. మోడీ అనుసరించే ప్రచార కండూతి వ్యూహం, అబద్ధపు హామీల బాటలో కేజ్రీవాల్ సైతం నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. కాలుష్యం, అవినీతి, ధరల పెరుగుదలను వారిద్దరూ పట్టించుకోవడం లేదన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు రిజర్వేషన్లలో తమ వాటాలను సాధించుకునేందుకు చేపట్టాల్సిన కులగణనపై మోడీ, కేజ్రీవాల్ మౌనం వహిస్తున్నారని విమర్శలు చేశారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Read Also: Laurene Powell: మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య..
అయితే, 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను రిలీజ్ చేస్తామని ఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ చెప్పారు. 2015 నుంచి రెండుసార్లు గెలిచిన ఆప్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారి ఢిల్లీలో పాగా వేయాలని ట్రై చేస్తుంది. మరోసారి ఢిల్లీలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది.
తాజావార్తలు
-
Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారు ఏమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!