Piyush Goyal: 40 రైతుల ఏళ్ల కల నెరవేరింది.. ఈ ఘనత వాళ్లదే..
- జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
- ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి
- మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి వర్చువల్గా ప్రారంభించారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి. నిన్ననే కేంద్రం పసుపు బోర్డు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆయన మాట నిలబెట్టుకున్నారు.
READ MORE: Bandi Sanjay Kumar: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయష్ గోయల్ మాట్లాడారు. “మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశాం. చెప్పినదాన్ని చేసి చూపించడమే మోడీ ప్రభుత్వం విధానం. 40 రైతుల ఏళ్ల పసుపు బోర్డు కల నిజం చేశాం. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు పని చేస్తుంది. దీని వల్ల పసుపు రైతుల అభివృద్ధికి మరింత ఊత లభిస్తుంది. ఈరోజు నుంచే పసుపు బోర్డు పనిచేయడం ప్రారంభిస్తుంది. స్పైస్ బోర్డు నిధులను ప్రస్తుతం దీనికి ఉపయోగిస్తాం. వచ్చే బడ్జెట్లో పసుపు బోర్డుకు తగిన నిధులు కేటాయిస్తాం. పసుపు బోర్డుకు తగ్గిన అధికారులు సిబ్బందిని కేటాయిస్తాం. రెండేళ్లలో పసుపు ఉత్పత్తి రెండింతలు చేస్తాం. పెద్ద ఎత్తున ఎగుమతులను ప్రోత్సహిస్తాం. ఆయుర్వేద ఔషధాల తయారీలో పసుపు వినియోగంపై ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. ప్రస్తుతం ఉన్న భవనాలనే పసుపు బోర్డుకు ఉపయోగిస్తాం. అరవింద్, బండి సంజయ్ పోరాట ఫలితమే పసుపు బోర్డు. పసుపు రైతుల ఆదాయం పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు 20 రాష్ట్రాల్లో 30 రకాల పసుపు పండుతుంది. ప్రపంచంలోని 70 శాతం భారత్ లోనే పండుతుంది.” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!