Piyush Goyal: 40 రైతుల ఏళ్ల కల నెరవేరింది.. ఈ ఘనత వాళ్లదే..
- జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
- ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి
- మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి వర్చువల్గా ప్రారంభించారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి. నిన్ననే కేంద్రం పసుపు బోర్డు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆయన మాట నిలబెట్టుకున్నారు.
READ MORE: Bandi Sanjay Kumar: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..
Also Read
ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయష్ గోయల్ మాట్లాడారు. “మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశాం. చెప్పినదాన్ని చేసి చూపించడమే మోడీ ప్రభుత్వం విధానం. 40 రైతుల ఏళ్ల పసుపు బోర్డు కల నిజం చేశాం. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు పని చేస్తుంది. దీని వల్ల పసుపు రైతుల అభివృద్ధికి మరింత ఊత లభిస్తుంది. ఈరోజు నుంచే పసుపు బోర్డు పనిచేయడం ప్రారంభిస్తుంది. స్పైస్ బోర్డు నిధులను ప్రస్తుతం దీనికి ఉపయోగిస్తాం. వచ్చే బడ్జెట్లో పసుపు బోర్డుకు తగిన నిధులు కేటాయిస్తాం. పసుపు బోర్డుకు తగ్గిన అధికారులు సిబ్బందిని కేటాయిస్తాం. రెండేళ్లలో పసుపు ఉత్పత్తి రెండింతలు చేస్తాం. పెద్ద ఎత్తున ఎగుమతులను ప్రోత్సహిస్తాం. ఆయుర్వేద ఔషధాల తయారీలో పసుపు వినియోగంపై ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. ప్రస్తుతం ఉన్న భవనాలనే పసుపు బోర్డుకు ఉపయోగిస్తాం. అరవింద్, బండి సంజయ్ పోరాట ఫలితమే పసుపు బోర్డు. పసుపు రైతుల ఆదాయం పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు 20 రాష్ట్రాల్లో 30 రకాల పసుపు పండుతుంది. ప్రపంచంలోని 70 శాతం భారత్ లోనే పండుతుంది.” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..