Wife harassment: యోగి జీ ఇలాంటి వారిని అరికట్టండి.. భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య..
- ఉత్తర్ ప్రదేశ్లో మరో అతుల్ సుభాష్..
- భార్య వేధింపులకు మోహిత్ త్యాగి అనే వ్యక్తి ఆత్మహత్య..
- భార్య, ఆమె కుటుంబీకుల వేధింపులపై సూసైడ్ లేఖ..
- చట్టాల దుర్వినియోగాలను అరికట్టాలని సీఎం యోగికి విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife harassment: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. భార్య, ఆమె తల్లిదండ్రుల వేధింపుల కారణంగా సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. గంటన్నర నిడివి ఉన్న వీడియో రికార్డ్ చేసి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పాడు. అయితే, తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే యూపీ ఘజియాబాద్లో చోటు చేసుకుంది. భార్య, ఆమె తరుపు బంధువుల వేధింపులకు 34 ఏళ్ల వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘజియాబాద్లోని మోడీనగర్ ప్రాంతానికి చెందిన మోహిత్ త్యాగి అనే ప్రైవేట్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. మోహిత్ సోదరుడు రాహుల్ త్యాగి, మోహిత్ భార్య భార్య ప్రియాంకా, ఆమె సోదరుడు పునీత్ త్యాగి, వదిన నీతు త్యాగి, మామలు అనిల్, విశేష్ త్యాగిల వేధింపుల కారణంగానే తన సోదరుడు మరణించాడని ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 10, 2020లో ప్రియాంకా అనే మహిళను మోహిత్ వివాహం చేసుకున్నాడు. ఇది మోహిత్కి రెండో వివాహం. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లయిన కొన్ని నెలల తర్వాత నుంచే వీరి మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి.
Also Read
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
Read Also: Maharashtra: ‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం..
2024లో మోహిత్ తల్లి బ్లడ్ క్యాన్సర్తో మరణించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తల్లి మరణించిన మూడు నెలల తర్వాత ప్రియాంకా, తన సోదరుడు, మరో వ్యక్తి సాయంతో ఇంట్లో ఉన్న ఆభరణాలు, లాకర్లో ఉన్న నగదును తీసుకుని వెళ్లిపోయింది. మోహిత్ ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఇది జరిగింది. సంఘటన జరుగుతున్న సమయంలో వీరిని మోహిత్ అన్న రాహుల్, అతడి భార్య ఆపేందుకు ప్రయత్నిస్తే, వీరిని కూడా బెదిరించి ఇంట్లో నుంచి ప్రియాంకా వెళ్లిపోయింది. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని తెలుస్తోంది.
ఏప్రిల్ 15న మోహిత్కి సంభాల్లోని చౌడా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అతడి భార్య కేసు పెట్టినట్లు చెప్పారు. ఇది జరిగిన తర్వాత మోహిత్ తన సన్నిహితులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి, తాను చనిపోతున్నట్లు చెప్పారు. తాను తన భార్య ప్రియాంకాని మార్చడానికి చాలా ప్రయత్నించానని, ఆమె ప్రవర్తన కారణంగానే తాను చనిపోతున్నట్లు మోహిత్ పేర్కొన్నాడు. విషం తాగిన మోహిత్ని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు. ప్రియాంకా తన కుటుంబం నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికి, తప్పుడు కేసుల్లో ఇరికించారని మోహిత్ ఆత్మహత్యకు ముందు ఆరోపించా3డు. వివాహ వివాదాలలో చట్టపరమైన నిబంధనల దుర్వినియోగాన్ని అరికట్టాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూసైడ్ లేఖలో కోరారు..
తాజావార్తలు
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి