Samantha: తిరుమలలో డిక్లరేషన్ సమర్పించి శ్రీ వారి దర్శనానికి సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆమె క్రిస్టియన్ కావడంతో ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో డిక్లరేషన్ సమర్పించింది. తాను అన్యమతస్థురాలైనప్పటికీ శ్రీవారిపై నమ్మకం ఉండటంతో దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరడంతో అధికారులు ఆమెను శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతించారు. సమంత నిర్మాతగా ‘శుభం’ అనే సినిమాను రూపొందించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఆ సినిమా యూనిట్తో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత సహా సినిమా యూనిట్ సభ్యులందరూ ఆలయానికి చేరుకున్నారు.
HCA : టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు బిగ్షాక్..
Also Read
ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సమంత సహా టీమ్కు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమంత గత ఏడాది ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘శుభం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, సినిమా బృందంతో కలిసి ఆమె తిరుమల రావడం గమనార్హం.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!