Punjab: గంటలో కోటీశ్వరుడుగా మారాడు.. ఎలాగో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కానీ కోటీశ్వరులు కావడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. కానీ కొందరు అనుకోకుండా కలసి వచ్చే ఆస్తులతో కోటీశ్వరులు అవుతుంటారు. కానీ గంటలో కోటీశ్వరుడు అవడం ఎక్కడైనా చూశారా? కానీ ఇక్కడ జరిగింది. గంట క్రితం వరకు ఆయనకు లక్షల్లో అప్పులు ఉన్నాయి.. కానీ గంట తరువాత అతను కోటీశ్వరుడుగా మారాడు. ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.. పంజాబ్లో గంటలో కోటీశ్వరుడైన వ్యక్తి స్టోరీ ఇది..
Read also: LIC Policy: ఎల్ఐసీ సూపర్ పాలసీ..రూ.54 లక్షలు పొందవచ్చు..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
అదృష్టవంతున్ని ఎవరు ఆపలేరు.. దురదృష్ట వంతున్ని ఎవరు మార్చలేరనేది నానుడి.. అలాంటి ఘటన పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి సరదాగా లాటరీ కొన్నాడు. అదీ ఒకటి కాదు.. 25 టికెట్లు కొన్నాడు. గంటలోనే అతను కొన్న లాటరీకి కోటి రూపాయలు బహుమతి వచ్చింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ అదృష్టవంతుడు పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాలో డేరా బాబా నానక్ టౌన్ కు చెందిన రూపీందర్ జిత్ సింగ్. అతను అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంకులో క్లర్కుగా పనిచేస్తున్నాడు. ఒక ఏడాదికాలంగా రూపీందర్ జిత్ సింగ్ లాటరీ టికెట్లు కొంటున్నాడు. శనివారం మధ్యాహ్నం కూడా అలాగే 12 గంటల సమయంలో నాగాలాండ్ లాటరీ టికెట్ కొన్నాడు. ఒక్కొక్కటి రూ. 6 చొప్పున.. 25 లాటరీ టికెట్లు కొన్నాడు. ఎప్పట్లాగా ఆ టికెట్లను తన దగ్గర పెట్టుకున్నాడు తరువాత బ్యాంకుకు వచ్చి.. బ్యాంకు పనిలో పడిపోయాడు. ఏడాదిగా లాటరీలు కొంటున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో దానిమీద పెద్దగా మనసు పెట్టలేదు.
Read also: ATM AC Robbery: ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీ ఎత్తుకెళ్లిపోయిన దుండగులు!
ఓ గంట తర్వాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీరు కోటి రూపాయలు గెలుచుకున్నా’రని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన రూపేందర్ ఆ తర్వాత సంతోషంతో ఉబ్బితబ్బైపోయాడు. విషయం తెలియడంతో బ్యాంకు సిబ్బంది రూపీందర్ జిత్ సింగ్ ను అభినందనల్లో ముంచెత్తారు. ఇదంతా కలలాగా ఉందంటూ రూపీందర్ జిత్ సింగ్ అంటున్నాడు. తాను గెలుచుకున్న ఈ మొత్తాన్ని తన పిల్లల కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని.. అందులో కొంత మొత్తాన్ని పేదల కోసం వాడతానన్నాడు. దీంతో లాటరీలు కొనే వారిలో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగిపోయింది. ఎందుకంటే కొద్దికాలం క్రితం ఇక్కడే ఓ కిరాణా దుకాణ యజమానికి కూడా లాటరీలో రూ.2.5 కోట్లు దక్కాయి.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!