Hardeep Singh Puri: రష్యా నుంచి పెట్రోల్ కొనొద్దని ఏ దేశం ఇండియాకు చెప్పలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No one told India to not buy oil from Russia Says Hardeep Singh Puri: రష్యా నుంచి భారత్ పెట్రోలియం కొనడంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. భారత్ తమ పౌరులకు ఇంధనాన్ని అందించడం నైతిక బాధ్యత అని.. అది ఎక్కడ నుంచైనా కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. ఏ దేశం కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారతదేశానికి ఏ దేశం కూడా చెప్పలేదని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని అన్నారు. సరఫరా, డిమాండ్ మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఆయన అన్నారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపై వ్యాపారులపై పడిందని.. ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసిందని ఆయన అన్నారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు ఏప్రిల్ నుంచి 50 రెట్లు పెరిగాయని.. ఇది భారత్ విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురులో 10 శాతం ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ముందు రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురు కేవలం 0.2 శాతం మాత్రమే అని తెలిపారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
Read Also: Nashik Bus Accident: మహారాష్ట్రలో ఘోరం.. బస్సులో మంటలు చెలరేగి 10 మంది మృతి
భారతదేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఎక్కడనుంచైనా చమురును కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు కేంద్రమంత్రి. ప్రజలకు ఇంధనాన్ని అందించడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. మీ పాలసీ గురించి మీకు స్పష్టత ఉంటే మీరు ఇంధనం కొనుగోలు చేయాలనుకున్న ప్రాంతం నుంచి కొనుగోలు చేస్తారని అన్నారు. అమెరికా ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ గ్రాన్ హోమ్ తో ద్వైపాక్షిక సమావేశం తరువాత హర్దీప్ సింగ్ పూరి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ ఎనర్జీపై అమెరికా-ఇండియా చర్చించుకున్నాయి. భవిష్యత్తులో రెండు దేశాలు గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి సహకరించుకోనున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేశాయి. ఈ నేపథ్యంలో ఇండియా డిస్కౌంట్ పై రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే భారత చర్యపై అమెరికాతో పాటు ఇతర యూరప్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. పలు సందర్భాల్లో విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ ను వెస్ట్రన్ మీడియా ఈ విషయంపై ప్రశ్నించింది. అయితే యూరప్ దేశాలు కొనుగోలు చేస్తున్నదాని కన్నా తక్కువగానే ఇండియా కొనుగోలు చేస్తుందని జైశంకర్ సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!