Kerala: పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ నాయకుడు.. కేరళలో వివాదాస్పద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత్ లో విభిన్న వాదనలతో ప్రజలు ఉన్నారు. అయితే కొంత మంది ఇజ్రాయిల్ కి మద్దతుగా, మరికొంత మంది పాలస్తీనాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు చోట్ల పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కేరళలోని మలప్పురంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదమైంది.
శుక్రవారం మలప్పురంలో సాలిడారిటీ యూత్ మూమెంట్ పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించింది. సాలిడారిటీ యూవ్ మూమెంట్ అనేది జమాతే ఇస్లామీ యూత్ వింగ్. అయితే ఈ ర్యాలీలో హమాస్ నాయకుడు ఒకరు ప్రజలను ఉద్దేశిస్తూ వర్చువల్ గా మాట్లాడటంపై వివాదం చెలరేగింది. ఈ ఘటనను రాష్ట్ర బీజేపీ చీఫ్ సురేంద్రన్ ఖండించారు. కేరళ పోలీసులు తీరును ఆయన ప్రశ్నించారు. ఇలా హమాస్ ఉగ్రవాద నాయకుడు ఈ ర్యాలీలో మాట్లాడటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
Read Also: Rojgar Mela 2023: 51 వేల మందికి ఉద్యోగాలు.. అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసిన ప్రధాని
సురేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘మలప్పురంలో సంఘీభావ కార్యక్రమంలో హమాస్ నాయకుడు ఖాలీద్ మషేల్ వర్చవల్ గా పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. పినరయి విజయన్ కేరళ పోలీసులు ఎక్కడ ఉన్నారు..? సేవ్ పాలస్తీనా ముసులో వారు హమాస్ ఉగ్రవాద సంస్థను కీర్తిస్తున్నారు. వారిని నాయకులు, యోధులుగా చెప్పడం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.
ఇదిలా ఉండగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పాలస్తీనా మద్దతు ర్యాలీలో కాంగ్రెస్ నేత శశిథరూర్ పాల్గొనడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దీన్ని హమాస్ అనుకూల కార్యక్రమంగా పేర్కొంది. పాలస్తీనా కోసం కోజికోడ్ లో 10 వేల మంది ఐయూఎంఎల్ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించడంపై మాట్లాడుతూ.. ఇది మరపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోయడానికి ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్టోబర్ 7న గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి ప్రజలను ఊచకోత కోశారు. మరణించిన వారిలో పసిపిల్లల నుంచి పండుముసలి వరకు అన్ని వర్గాల వారు ఉన్నారు. ఈ దాడిలో 1400 మంది మరణించారు. మరో 200 మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ గాజాపై వరసగా దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే మరణాల సంఖ్య 7000లను దాటింది. ఉగ్రవాదులతో సహా సాధారణ పాలస్తీనా ప్రజలు కూడా మరణిస్తున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!