Gujarat Elections: గుజరాత్ తొలి పోరు నేడే.. 89 స్థానాలకు పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Set To Vote For 788 Candidates On 89 Seats For 1st Phase: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. నేడు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఎన్నికలకమిషన్ అన్ని ఏర్పాట్లను చేసింది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉంటే తొలివిడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు తొలివిడతలో పోలింగ్ జరగనుంది. అన్ని రాజకీయ పార్టీ నుంచి మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 14,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
గుజరాత్ దక్షిణ జిల్లాలు, సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల్లో నెలకొన్న 19 జిల్లాల్లో తొలి విడత పోరు జరగనుంది. 2017 ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ పార్టీలు 40 స్థానాలను గెలుపొందాయి. అయితే ఈ సారి రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా పోటీలో నిలువనున్నాయి.బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాలకు గానూ తమ అభ్యర్థులను నిల్చోబెట్టాయి. ఆప్ 88 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపింది. బీఎస్పీ 57, బీటీపీ 14, సీపీఎం నలుగురు అభ్యర్థులను బరిలో దింపింది. తొలి విడతలో 339 మంది స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు.
Also Read
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: ISIS: ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ హసన్ అల్ ఖురాషీ హతం..
ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ సౌరాష్ట్రలోని ద్వారకా జిల్లా ఖంభాలియా స్థానం నుంచి పోటీలో ఉన్నాడు. జామ్ నగర్ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా పోటీ చేస్తున్నారు. సూరత్ నుంచి బీజేపీ మంత్రి హర్ష్ సంఘవి పోటీలో ఉన్నారు. తొలి విడత ఎన్నికలు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పట్టు ఉంది. ఇక సూరత్ ప్రాంతం బీజేపీకి కంచుకోటగా ఉంది.
గుజరాత్ లో మొత్తం 4,91,35,400 మంది ఓటర్లలో మొదటి దశ ఎన్నికల్లో 2,39,76,670 మంది ఓటు వినియోగించుకోనున్నారు. మొత్తం 14 వేల పోలింగ్ స్టేషన్లలో 3,311 పట్టణాల్లో, 11,071 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మొత్తం 2,20,288 మంది శిక్షణ పొందిన అధికారులు, ఉద్యోగులు విధుల్లో ఉంటారని ఈసీ తెలిపింది.
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!