MSP Increase: రైతులకు కేంద్రం శుభవార్త.. కనీస మద్దతు ధర పెంపుకు క్యాబినెట్ ఓకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MSP Increase: ఖరీఫ్ పంటలపై కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. పెసర పంటకు 10.4 శాతం, వేరుశెనగ 9 శాతం , నువ్వులు శాతం, వరి 7 శాతం, సోయాబీన్, రాగులు, జొన్న, పొద్దు తిరుగుడు పంటకలకు సుమారుగా 6-7 శాతం చొప్పున 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఎంఎస్పీని పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
Read Also: WTC Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న భారత్
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, సాగుదారులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడం, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వరి (సాధారణ) ఎంఎస్పి క్వింటాల్కు రూ. 143 పెంచి, రూ.2,183గా నిర్ణయించినట్లు తెలిపారు. గత సీజన్లో క్వింటాల్కు రూ.2,040 ఉంది. అంటే 7 శాతం పెంచారు. వరి ఎంఎస్పి (ఎ గ్రేడ్) క్వింటాల్కు రూ. 2,203గా నిర్ణయించబడింది, ఇది గతేడాది క్వింటాల్కు రూ. 2,060 ఉండేది. పెసరకు గతేడాది ఎంఎస్పీ క్వింటాల్ కి రూ. 7,755 ఉంటే ఈ ఏడాది రూ. 803 పెంచి, రూ. 8,558గా మద్దతు ధరను నిర్ణయించారు.


తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..