Monsoon: జూన్ 9న కేరళలోకి రుతుపవనాలు.. బిపోర్జాయ్ తుఫాన్ ప్రభావం..
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే శుక్రవారం అంటే జూన్ 9 నాటికి కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని, అందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ బుధవారం అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఈ రుతుపవనాల రాక మరింత ఆలస్యం అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేస్తోంది. బిపోర్జాయ్ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
Also Read
- TVK Vijay: "ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర".. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
- Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
Read Also: Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..
గతేడాది జూన్1న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయి. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో తుఫాన్ కారణంగా రుతుపవనాల కదలిక బలహీనంగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే 96 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఎల్ నినో ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాన్ వేగంగా బలపడుతోంది. తీవ్ర తుఫాన్ గా మారింది. బుధవారం ఉదయం 5.30 గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి ప్రాంతంలో, ముంబాయికి 1000 కిలోమీటర్ల నైరుతిలో, పోర్ బందర్ కు 1,070 కిలోమీటర్ల దూరం దక్షిణాన- నైరుతిలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తర-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్తలో సముద్రంలోకి ప్రజలు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
MI vs CSK: రోహిత్, ధోనీ ఆడతారా?.. ముంబై-చెన్నై మ్యాచ్కు ముందు కీలక అప్డేట్!
-
Divyanka Sirohi : గుండెపోటుతో హీరోయిన్ మృతి..
-
TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
-
Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?