Monsoon: జూన్ 9న కేరళలోకి రుతుపవనాలు.. బిపోర్జాయ్ తుఫాన్ ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే శుక్రవారం అంటే జూన్ 9 నాటికి కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని, అందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ బుధవారం అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఈ రుతుపవనాల రాక మరింత ఆలస్యం అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేస్తోంది. బిపోర్జాయ్ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
Read Also: Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..
గతేడాది జూన్1న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయి. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో తుఫాన్ కారణంగా రుతుపవనాల కదలిక బలహీనంగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే 96 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఎల్ నినో ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాన్ వేగంగా బలపడుతోంది. తీవ్ర తుఫాన్ గా మారింది. బుధవారం ఉదయం 5.30 గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి ప్రాంతంలో, ముంబాయికి 1000 కిలోమీటర్ల నైరుతిలో, పోర్ బందర్ కు 1,070 కిలోమీటర్ల దూరం దక్షిణాన- నైరుతిలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తర-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్తలో సముద్రంలోకి ప్రజలు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?