Monsoon: జూన్ 9న కేరళలోకి రుతుపవనాలు.. బిపోర్జాయ్ తుఫాన్ ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే శుక్రవారం అంటే జూన్ 9 నాటికి కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని, అందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ బుధవారం అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఈ రుతుపవనాల రాక మరింత ఆలస్యం అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేస్తోంది. బిపోర్జాయ్ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..
గతేడాది జూన్1న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయి. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో తుఫాన్ కారణంగా రుతుపవనాల కదలిక బలహీనంగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే 96 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఎల్ నినో ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాన్ వేగంగా బలపడుతోంది. తీవ్ర తుఫాన్ గా మారింది. బుధవారం ఉదయం 5.30 గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి ప్రాంతంలో, ముంబాయికి 1000 కిలోమీటర్ల నైరుతిలో, పోర్ బందర్ కు 1,070 కిలోమీటర్ల దూరం దక్షిణాన- నైరుతిలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తర-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్తలో సముద్రంలోకి ప్రజలు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..