PM Modi: మానవుడి భవిష్యత్త్ యుద్ధంలో లేదు.. బుద్ధుడిలో ఉందంటూ రష్యా, ఇజ్రాయెల్లకు మోడీ చురకలు!
- మానవుడి భవిష్యత్తు యుద్ధంలో లేదు.. బుద్ధుడిలో ఉందని ప్రధాని మోడీ..
- అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు ఛాన్స్ ఉన్నా.. బౌద్ధం స్వీకరించారు..
- భారత్ కేవలం యువ దేశమే కాదు.. నిపుణులైన యువకుల దేశం: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నేడు ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతున్న 18వ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒడిశాలో అడుగడుగునా వారసత్వమే కనిపిస్తుంది.. ఇక్కడి నుంచి వ్యాపారులు సుమత్రా, బాలి, జావా లాంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసేవారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి కేవలం భారత్ తల్లి లాంటిది మాత్రమే కాదు.. అది మన జీవితాల్లో భాగం అని ఆయన వెల్లడించారు. జీ20 సందర్భంగా భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేశామని చెప్పారు. మన దగ్గర ఉన్న విభిన్న సంస్కృతులను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి.. భారతదేశం స్వాతంత్ర్యం సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసుల పాత్ర కూడా ఉందని నరేంద్ర మోడీ తెలిపారు.
Read Also: Tirupati Stampede: మృతుల సంఖ్య పై క్లారిటీ ఇచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి..
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
అయితే, ప్రవాస భారతీయులు వచ్చే ఏడాది ఈ ఉత్సవానికి వచ్చేటప్పుడు ఐదుగురు విదేశీ మిత్రులను తమతో పాటు తీసుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. భారత్ కేవలం యువ దేశమే కాదు.. నిపుణులైన యువకుల దేశం కూడా అని చెప్పుకొచ్చారు. భారత్కు ‘విశ్వబంధు’గా పేరుంది.. దానిని మరింత బలోపేతం చేస్తామన్నారు. మహాకుంభ్, సంక్రాంతి, లొహిర్, మాగ్ బిహు లాంటి పండుగల సీజన్లో ప్రవాస భారతీయ వేడుకలు జరపడం విశేషం అన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షుడు క్రిస్టీనే కార్ల వీడియోలో పంపిన సందేశంలో భారత్ యొక్క పురోగతి గురించి వెల్లడించారు.
Read Also: RK Roja: తిరుపతి ఘటనపై స్పందించిన రోజా.. పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు..
కాగా, రష్యా, ఇజ్రాయెల్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా భవిష్యత్తు యుద్ధంలో కాదని.. బుద్ధుడిలో ఉందని నరేంద్ర మోడీ తెలిపారు. అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు ఛాన్స్ ఉన్నా.. బౌద్ధం స్వీకరించారని ఆయన గుర్తు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మోడీ ప్రవాసి భారతీయ ఎక్స్ప్రెస్’ రైలును భువనేశ్వర్లో జెండా ఊపి ఆరంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!