PM Modi: మానవుడి భవిష్యత్త్ యుద్ధంలో లేదు.. బుద్ధుడిలో ఉందంటూ రష్యా, ఇజ్రాయెల్లకు మోడీ చురకలు!
- మానవుడి భవిష్యత్తు యుద్ధంలో లేదు.. బుద్ధుడిలో ఉందని ప్రధాని మోడీ..
- అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు ఛాన్స్ ఉన్నా.. బౌద్ధం స్వీకరించారు..
- భారత్ కేవలం యువ దేశమే కాదు.. నిపుణులైన యువకుల దేశం: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నేడు ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతున్న 18వ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒడిశాలో అడుగడుగునా వారసత్వమే కనిపిస్తుంది.. ఇక్కడి నుంచి వ్యాపారులు సుమత్రా, బాలి, జావా లాంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసేవారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి కేవలం భారత్ తల్లి లాంటిది మాత్రమే కాదు.. అది మన జీవితాల్లో భాగం అని ఆయన వెల్లడించారు. జీ20 సందర్భంగా భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేశామని చెప్పారు. మన దగ్గర ఉన్న విభిన్న సంస్కృతులను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి.. భారతదేశం స్వాతంత్ర్యం సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసుల పాత్ర కూడా ఉందని నరేంద్ర మోడీ తెలిపారు.
Read Also: Tirupati Stampede: మృతుల సంఖ్య పై క్లారిటీ ఇచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి..
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
అయితే, ప్రవాస భారతీయులు వచ్చే ఏడాది ఈ ఉత్సవానికి వచ్చేటప్పుడు ఐదుగురు విదేశీ మిత్రులను తమతో పాటు తీసుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. భారత్ కేవలం యువ దేశమే కాదు.. నిపుణులైన యువకుల దేశం కూడా అని చెప్పుకొచ్చారు. భారత్కు ‘విశ్వబంధు’గా పేరుంది.. దానిని మరింత బలోపేతం చేస్తామన్నారు. మహాకుంభ్, సంక్రాంతి, లొహిర్, మాగ్ బిహు లాంటి పండుగల సీజన్లో ప్రవాస భారతీయ వేడుకలు జరపడం విశేషం అన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షుడు క్రిస్టీనే కార్ల వీడియోలో పంపిన సందేశంలో భారత్ యొక్క పురోగతి గురించి వెల్లడించారు.
Read Also: RK Roja: తిరుపతి ఘటనపై స్పందించిన రోజా.. పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు..
కాగా, రష్యా, ఇజ్రాయెల్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా భవిష్యత్తు యుద్ధంలో కాదని.. బుద్ధుడిలో ఉందని నరేంద్ర మోడీ తెలిపారు. అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు ఛాన్స్ ఉన్నా.. బౌద్ధం స్వీకరించారని ఆయన గుర్తు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మోడీ ప్రవాసి భారతీయ ఎక్స్ప్రెస్’ రైలును భువనేశ్వర్లో జెండా ఊపి ఆరంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..