RK Roja: తిరుపతి ఘటనపై స్పందించిన రోజా.. పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు..
- తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం
- చంద్రబాబు అసమర్థత వల్లే ఘటన
- సనాతన యోధుడు పవన్ ఎక్కడ?
- ఇప్పుడు ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శిచారు.. ఘటనకు కారణమెవరో కనుక్కోకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. అధికారులను, టీటీడీ బోర్డును ఎవరు పెట్టారని ప్రశ్నించారు.. భక్తులకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశ్యం ఎవరికి లేదన్నారు.. అధికారులు చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతూ భక్తులను గాలికి వదిలేశారని విమర్శించారు.. గత ఏడాది వైసీపీ హయాంలో ఎలా చేశామో అందరూ చూశారన్నారు.
కనీస సదుపాయాలు కరువు: రోజా
“భక్తులకు కనీస సదుపాయాలు లేవు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. తెలంగాణలో చూసాం.. ఓ ఘటనలో మహిళ చనిపోతే అల్లు అర్జున్ పై కేసు పెట్టారు.. ఈ ఘటనలో చంద్రబాబు నుంచి క్రింది స్థాయి అధికారులు బాధ్యత వహించాలి.. ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలా కేసులు నమోదు చేశారు.. విజయవాడ హైందవ శంఖారావంలో చెప్పారు.. హిందువులను కాపాడాలని చెప్పారు.. ఇప్పుడు ఆ పీఠాధిపతులు ఏమయ్యారు.. తిరుమల లడ్డుపై బీజేపీ, టీడీపీ నేతలు ఎన్ని మాట్లాడారో అందరూ చూశారు.. మీరు చేస్తే కరెక్టు.. మరొకరు చేస్తే తప్పు అన్నట్లు చేస్తున్నారు.. ప్రధాని మోడీకి ఒకటే విజ్ఞాపన చేస్తున్నా.. బాధ్యులను కఠినంగా శిక్షించాలి..
Also Read
పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు…
“సనాతన యోధుడు ఈ ఘటనకు ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు.. చంద్రబాబుతో రాజీనామా చేయిస్తారా.. మీరు చేస్తారా..? హోం మంత్రి కేవలం ఇతరులను తిట్టడానికి తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటానికి పనికి రావటం లేదు.. తొక్కిసలాటకు కారణమైన బాధ్యుతలపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలి.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారు.” అని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!