AAP: ఉచితాలను కొనసాగిస్తూనే, మరో 8-10 హమీలు.. ఢిల్లీలో ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీలు’’
- ఉచితాలను కొనసాగిస్తూనే, మరిన్ని కొత్త హామీలు..
- మేనిఫేస్టోని సిద్ధం చేస్తున్న ఆప్..
- ఢిల్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా హామీల వెల్లువ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని ఆప్ భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఇక కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి అనేక హామీలను సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు.
ఓటర్లను ఆకర్షించడానికి ఆప్ ఉచితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆప్ మేనిఫెస్టోలో 8-10 ఎన్నికల వాగ్దాలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. మహిళలకు ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య, తీర్థ యాత్ర, బస్సు ప్రయాణాలతో పాటు, ఆప్ మ్యానిఫెస్టో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ ‘‘మోడీ కి గ్యారెంటీ’’ నినాదంలో ముందుకు వెళ్లింది, ఈ సారి ఆప్ కూడా ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీ’’ పేరుతో ఎన్నికల బరిలోకి వెళ్తోంది.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: Puri Shankaracharya: హిందువుల్ని రక్షించండి లేదా తీవ్ర పరిణామాలు ఉంటాయి..
ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం దక్కించుకునేందుకు ఆప్ మహిళా సమ్మన్ యోజన, సంజీవని యోజన అనే పేరుతో రెండు ప్రధాన పథకాలను తీసుకురాబోతున్నట్లు చెప్పింది. ఈ సారి ఎన్నికల్లో తాము గెలిస్తే మహిళా ఓటర్లకు (ఆదాయపు పన్ను చెల్లించనివారికి) నెలవారీ భరణాన్ని రూ. 1000 నుంచి రూ.2100కి పెంచుతామని హామీ ఇచ్చింది. ‘సంజీవని యోజన’ కింద, 60 ఏళ్లు పైబడిన నివాసితులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. పూజారి గ్రంథి సమ్మాన్ యోజన కింద నెలకు రూ.18,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా పూజారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
ఆటోరిక్షా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ భద్రతా పథకానికి హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ రూ.15 లక్షల విలువైన జీవిత, ప్రమాద బీమా, వారి కుమార్తెల వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, సంవత్సరానికి రెండుసార్లు రూ.2,500 యూనిఫాం అలవెన్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. నీటి బిల్లుల మాఫీ, స్వచ్ఛమైన తాగునీరు, ప్రధాన మౌళిక సదుపాయాలను మేనిఫెస్టోలో భాగం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..