AAP: ఉచితాలను కొనసాగిస్తూనే, మరో 8-10 హమీలు.. ఢిల్లీలో ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీలు’’
- ఉచితాలను కొనసాగిస్తూనే, మరిన్ని కొత్త హామీలు..
- మేనిఫేస్టోని సిద్ధం చేస్తున్న ఆప్..
- ఢిల్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా హామీల వెల్లువ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని ఆప్ భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఇక కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి అనేక హామీలను సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు.
ఓటర్లను ఆకర్షించడానికి ఆప్ ఉచితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆప్ మేనిఫెస్టోలో 8-10 ఎన్నికల వాగ్దాలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. మహిళలకు ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య, తీర్థ యాత్ర, బస్సు ప్రయాణాలతో పాటు, ఆప్ మ్యానిఫెస్టో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ ‘‘మోడీ కి గ్యారెంటీ’’ నినాదంలో ముందుకు వెళ్లింది, ఈ సారి ఆప్ కూడా ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీ’’ పేరుతో ఎన్నికల బరిలోకి వెళ్తోంది.
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
Read Also: Puri Shankaracharya: హిందువుల్ని రక్షించండి లేదా తీవ్ర పరిణామాలు ఉంటాయి..
ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం దక్కించుకునేందుకు ఆప్ మహిళా సమ్మన్ యోజన, సంజీవని యోజన అనే పేరుతో రెండు ప్రధాన పథకాలను తీసుకురాబోతున్నట్లు చెప్పింది. ఈ సారి ఎన్నికల్లో తాము గెలిస్తే మహిళా ఓటర్లకు (ఆదాయపు పన్ను చెల్లించనివారికి) నెలవారీ భరణాన్ని రూ. 1000 నుంచి రూ.2100కి పెంచుతామని హామీ ఇచ్చింది. ‘సంజీవని యోజన’ కింద, 60 ఏళ్లు పైబడిన నివాసితులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. పూజారి గ్రంథి సమ్మాన్ యోజన కింద నెలకు రూ.18,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా పూజారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
ఆటోరిక్షా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ భద్రతా పథకానికి హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ రూ.15 లక్షల విలువైన జీవిత, ప్రమాద బీమా, వారి కుమార్తెల వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, సంవత్సరానికి రెండుసార్లు రూ.2,500 యూనిఫాం అలవెన్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. నీటి బిల్లుల మాఫీ, స్వచ్ఛమైన తాగునీరు, ప్రధాన మౌళిక సదుపాయాలను మేనిఫెస్టోలో భాగం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!