AAP: ఉచితాలను కొనసాగిస్తూనే, మరో 8-10 హమీలు.. ఢిల్లీలో ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీలు’’
- ఉచితాలను కొనసాగిస్తూనే, మరిన్ని కొత్త హామీలు..
- మేనిఫేస్టోని సిద్ధం చేస్తున్న ఆప్..
- ఢిల్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా హామీల వెల్లువ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని ఆప్ భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఇక కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి అనేక హామీలను సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు.
ఓటర్లను ఆకర్షించడానికి ఆప్ ఉచితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆప్ మేనిఫెస్టోలో 8-10 ఎన్నికల వాగ్దాలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. మహిళలకు ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య, తీర్థ యాత్ర, బస్సు ప్రయాణాలతో పాటు, ఆప్ మ్యానిఫెస్టో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ ‘‘మోడీ కి గ్యారెంటీ’’ నినాదంలో ముందుకు వెళ్లింది, ఈ సారి ఆప్ కూడా ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీ’’ పేరుతో ఎన్నికల బరిలోకి వెళ్తోంది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Puri Shankaracharya: హిందువుల్ని రక్షించండి లేదా తీవ్ర పరిణామాలు ఉంటాయి..
ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం దక్కించుకునేందుకు ఆప్ మహిళా సమ్మన్ యోజన, సంజీవని యోజన అనే పేరుతో రెండు ప్రధాన పథకాలను తీసుకురాబోతున్నట్లు చెప్పింది. ఈ సారి ఎన్నికల్లో తాము గెలిస్తే మహిళా ఓటర్లకు (ఆదాయపు పన్ను చెల్లించనివారికి) నెలవారీ భరణాన్ని రూ. 1000 నుంచి రూ.2100కి పెంచుతామని హామీ ఇచ్చింది. ‘సంజీవని యోజన’ కింద, 60 ఏళ్లు పైబడిన నివాసితులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. పూజారి గ్రంథి సమ్మాన్ యోజన కింద నెలకు రూ.18,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా పూజారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
ఆటోరిక్షా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ భద్రతా పథకానికి హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ రూ.15 లక్షల విలువైన జీవిత, ప్రమాద బీమా, వారి కుమార్తెల వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, సంవత్సరానికి రెండుసార్లు రూ.2,500 యూనిఫాం అలవెన్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. నీటి బిల్లుల మాఫీ, స్వచ్ఛమైన తాగునీరు, ప్రధాన మౌళిక సదుపాయాలను మేనిఫెస్టోలో భాగం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
-
RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!