Sandeshkhali: సందేశ్ఖాలీలో విదేశీ ఆయుధాలు, బాంబులు.. స్వాధీనం చేసుకున్న సీబీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali: లోక్సభ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన పలువురు నేతులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటంతో అక్కడి మహిళలు తిరగబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్ని అరెస్ట్ చేయాలంటూ ఉద్యమించారు. అయితే, 55 రోజుల పరారీ తర్వాత కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఇతడిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.
జనవరి 5న ఈడీ అధికారులపై టీఎంసీ నేతలు చేసిన దాడి కేసులో ప్రస్తుతం సీబీఐ ఆ ప్రాంతంలోని ఓ ఇంటిపై దాడులు చేసింది. సందేశ్ఖాలీలోని సర్బేరియా ప్రాంతంలోని స్థానిక తృణమూల్ నాయకుడు హఫీజుల్ ఖాన్ బంధువైన ఒకరి ఇంటిపై సీబీఐ రైడ్స్ నిర్వహించింది. కేంద్ర భద్రతా బలగాల సాయంతో సీబీఐ నిర్వహించిన ఈ దాడుల్లో విదేశీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అనేక బాంబుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను గుర్తించేందుకు బాంబు స్కానింగ్ పరికరాలను కూడా తీసుకుని వచ్చారు.
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
Read Also: Konda Visveshwar Reddy: చేవెళ్ల మేనిఫెస్టోను విడుదల చేసిన కొండా.. ‘సంకల్ప పత్రం’ పేరిట రిలీజ్
మహిళలపై అఘాయిత్యాలు, భూ కబ్జాలు, హింసకు పాల్పడుతున్న కేసుల్లో ప్రధాన నిందితుడిగా టీఎంసీ మాజీ నాయకుడు షేక్ షాజహాన్ ఉన్నారు. రేషన్ కుంభకోణంపై విచారణ జరిపేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు జనవరి 5న దాడి చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా షాజహాన్ దురాగతాలు బయటకు వచ్చాయి. కలకత్తా హైకోర్టు ఇతడిని ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసే అధికారం ఉందని తీర్పు చెప్పిన ఒక రోజు తర్వాత బెంగాల్ పోలీసులు 55 రోజులు పరారీలో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. అయితే, ఇతడికి సీఎం మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారంటూ బీజేపీ ఆరోపించింది. ఇతడి అరెస్ట్ తర్వాత టీఎంసీ తన పార్టీ నుంచి ఆరేళ్లు సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..