Supreme Court: కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది.. యాసిన్ మాలిక్ కేసులో వ్యాఖ్య
- కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది
- వేర్పాటువాది యాసిన్ మాలిక్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేర్పాటువాది యాసిన్మాలిక్ కేసు విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాసిన్ మాలిక్ను కోర్టులో వ్యక్తిగతంగా హాజరుపర్చాలన్న ఆదేశాల మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మన దేశంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయబద్ధంగానే జరిగింది కదా? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలమని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: Kejriwal: లిక్కర్ కేసులో ఎదురుదెబ్బ.. ట్రయిల్ కోర్టు విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
1990లో శ్రీనగర్లో నలుగురు ఎయిర్ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ కిడ్నాప్ కేసులో వేర్పాటువాది యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల విచారణకు మాలిక్ వ్యక్తిగతంగా హాజరుకావాలని జమ్మూ కోర్టు గతంలో ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం జమ్మూ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. తాజాగా గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. భద్రతా కారణాల రీత్యా మాలిక్ను జమ్మూకు తీసుకెళ్లలేమని.. సాక్ష్యుల భద్రత కూడా మాకు ముఖ్యమేనని పేర్కొన్నారు. గతంలో ఓ సాక్షిని హత్య చేశారని.. లాయర్ను పెట్టుకోకుండా మాలిక్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడని తెలిపారు. మాలిక్ సాధారణ క్రిమినల్ కాదని.. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్తో అతడికి సంబంధాలున్నాయని గుర్తుచేశారు. గతంలో చాలాసార్లు సయీద్ను కలిసేందుకు పాకిస్థాన్కు కూడా వెళ్లాడని.. ఇలాంటి కేసుల్లో మేం కేవలం పుస్తకాల్లో ఉన్నట్లు చేయలేమని సీబీఐ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Maharashtra Elections: చరిత్ర సృష్టించిన “మహా” ఓటర్లు.. దశాబ్ధం తర్వాత ఎక్కువ ఓటింగ్ శాతం..
సీబీఐ సమాధానానికి ధర్మాసనం బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కోర్టుకు తీసుకెళ్లకపోతే వీడియో కాన్ఫరెన్స్లో క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలం? జమ్మూలో ఇంటర్నెట్ సదుపాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. మన దేశంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్కు కూడా పారదర్శక విచారణ ఎదుర్కొనేలా అవకాశాలు కల్పించాం’’ అని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

తాజావార్తలు
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
-
CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..