Uddav Thackeray: ఎలక్షన్ కమీషన్ ప్రధాని మోదీకి బానిస.. మా “విల్లు-బాణం” దొంగిలించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddav Thackeray: శివసేన పార్టీని, విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్దవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అయితే ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడుతామని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశం అయ్యారు. ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీకి బానిసగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓపికపట్టండి.. తదుపరి బీఎంసీ ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ కార్యకర్తలకు సూచించారు ఠాక్రే.
Read Also: Bandi Sanjay : రజాకార్ల పాలనను తరిమికొడతా
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
తన పార్టీ చిహ్నం విల్లు-బాణాన్ని దొంగిలిచారని.. దొంగకు బుద్ది చెప్పాలని సీఎం ఏక్ నాథ్ షిండేను ఉద్దేశిస్తూ విమర్శించారు. వారికి బాలాసాహెబ్ ఠాక్రే ముఖం కావాలి.. ఎన్నికల గుర్తు కావాలి కానీ శివసేన కుటుంబం అక్కరలేదని.. మహారాష్ట్రకు రావాలంటే ప్రధాని నరేంద్రమోడీకి బాలాసాహెబ్ ఠాక్రే ముసుగు అవసరం అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఏ ముఖం నిజయో, ఏది కాదో అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు. దొంగలకు పవిత్రమైన విల్లు-బాణం గుర్తు ఇచ్చారు. కావాలంటే వాళ్లు టార్చ్(మషాల్) గుర్తును కూడా తీసుకోవచ్చని.. వారు నిజమైన మాగాళ్లే అయితే విల్లు-బాణం గుర్తతో మా ముందుకు రండి.. మేము టార్చ్ తో ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. ఇది మాకు పరీక్ష అని, యుద్ధం మొదలైందని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.
గతేడాది శివసేనలో చీలిక కారణంగా అధికారంలో ఉన్న శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)- కాంగ్రెస్- ఎన్సీపీల మహావికాస్ అఘాడీ కూటమి కూలిపోయింది. మొత్తం 56 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు ఇచ్చారు. దీంతో ఏక్ నాథ్ షిండే వర్గం, బీజేపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే శివసేన రెండు వర్గాల మధ్య పార్టీ, ఎన్నికల చిహ్నంపై గత ఏడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. పార్టీ ఎవరికి చెందుతుందనే దానిపై నిన్న కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏక్ నాథ్ షిండే వర్గానికే పార్టీ, ఎన్నికల గుర్తు చెందుతుందని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!