Uddav Thackeray: ఎలక్షన్ కమీషన్ ప్రధాని మోదీకి బానిస.. మా “విల్లు-బాణం” దొంగిలించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddav Thackeray: శివసేన పార్టీని, విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్దవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అయితే ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడుతామని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశం అయ్యారు. ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీకి బానిసగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓపికపట్టండి.. తదుపరి బీఎంసీ ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ కార్యకర్తలకు సూచించారు ఠాక్రే.
Read Also: Bandi Sanjay : రజాకార్ల పాలనను తరిమికొడతా
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
తన పార్టీ చిహ్నం విల్లు-బాణాన్ని దొంగిలిచారని.. దొంగకు బుద్ది చెప్పాలని సీఎం ఏక్ నాథ్ షిండేను ఉద్దేశిస్తూ విమర్శించారు. వారికి బాలాసాహెబ్ ఠాక్రే ముఖం కావాలి.. ఎన్నికల గుర్తు కావాలి కానీ శివసేన కుటుంబం అక్కరలేదని.. మహారాష్ట్రకు రావాలంటే ప్రధాని నరేంద్రమోడీకి బాలాసాహెబ్ ఠాక్రే ముసుగు అవసరం అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఏ ముఖం నిజయో, ఏది కాదో అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు. దొంగలకు పవిత్రమైన విల్లు-బాణం గుర్తు ఇచ్చారు. కావాలంటే వాళ్లు టార్చ్(మషాల్) గుర్తును కూడా తీసుకోవచ్చని.. వారు నిజమైన మాగాళ్లే అయితే విల్లు-బాణం గుర్తతో మా ముందుకు రండి.. మేము టార్చ్ తో ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. ఇది మాకు పరీక్ష అని, యుద్ధం మొదలైందని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.
గతేడాది శివసేనలో చీలిక కారణంగా అధికారంలో ఉన్న శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)- కాంగ్రెస్- ఎన్సీపీల మహావికాస్ అఘాడీ కూటమి కూలిపోయింది. మొత్తం 56 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు ఇచ్చారు. దీంతో ఏక్ నాథ్ షిండే వర్గం, బీజేపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే శివసేన రెండు వర్గాల మధ్య పార్టీ, ఎన్నికల చిహ్నంపై గత ఏడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. పార్టీ ఎవరికి చెందుతుందనే దానిపై నిన్న కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏక్ నాథ్ షిండే వర్గానికే పార్టీ, ఎన్నికల గుర్తు చెందుతుందని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!