Election Commission: మహారాష్ట్ర ఎన్నికల అనుమానాలపై కాంగ్రెస్కి ఈసీ ఆహ్వానం..
- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు..
- డిసెంబర్ 3న తమని కలిసేందుకు ఆహ్వానించిన ఈసీ..
- ఈవీఎంలపై ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు..
- పేపర్ బ్యాలెట్ తేవాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ 100కి పైబడి సీట్లలో పోటీ చేస్తే కేవలం 16 చోట్ల విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Read Also: Honda Amaze Facelift: న్యూ డిజైన్తో లాంచ్ అవుతున్న హోండా అమేజ్.. ఫీచర్లు, వివరాలివే..!
Also Read
కాంగ్రెస్ పార్టీ అనుమానాలను, ఆందోళనల్ని పరిష్కరించడానికి ఎన్నికల సంఘం డిసెంబర్ 3న ఆ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించింది. ఓటర్ ఓటింగ్ డేటాకు సంబంధించిన సమస్యపై స్పందించిన ఈసీ, ఇందులో ఎలాంటి వ్యత్యాసం లేదని, పోలింగ్ స్టేషన్ల వారీగా అభ్యర్థలందరికీ డేటా అందుబాటులో ఉందని చెప్పింది.సాయంత్రం 5 గంటల పోలింగ్ డేటా, ఫైనల్ ఓటింగ్ డేటా మధ్య గ్యాప్ అనేది ప్రిసీడింగ్ అధికారులు ఇతర విధుల నిర్వర్తించడంలో నిమగ్నమై ఉండటం వల్ల జరిగిందని చెప్పింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో సుమారు రాత్రి 11.45 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్ నోట్ విడుదల చేసింది, ఆ తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సమయాన్ని అనుసరించినట్లు ఈసీ తెలిపింది.
మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియలకు సంబంధించిన డేటాలో కాంగ్రెస్ అనుమానాలను వ్యక్తం చేసింది. తీవ్రమైన అసమానలు ఉన్నాయని ఆరోపించింది. దీనిపై శుక్రవారం ఎన్నికల కమిషన్ ముందు అనుమానాలను లేవనెత్తింది. సంబంధిత సాక్ష్యాలు సమర్పించడానికి వ్యక్తిగత విచారణనున కోరింది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు ఏర్పడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ.. పేపర్ బ్యాలెట్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. శుక్రవారం కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఇదే వాదనల్ని పునరావృతం చేశారు. ఎన్నికల సంఘం కాంగ్రెస్ ఆరోపణల్ని తిరస్కరించింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT)తో సహా పలు లేయర్ల వెరిఫికేషన్ మరియు ట్యాంపర్ ప్రూఫ్ మెకానిజమ్స్తో EVMలు సురక్షితంగా ఉన్నాయని పోల్ బాడీ తెలిపింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!