Maldives: మాల్దీవులను విడిచిపెట్టిన 2వ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది.. ప్రకటించిన మహ్మద్ ముయిజ్జూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక, చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను, మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిన పంపిస్తానని హామీ ఇచ్చాడు. దీనిపై భారత్-మాల్దీవుల మధ్య పలు చర్చలు జరిగాయి. చివరకు భారత సిబ్బంది ఆ దేశాన్ని వదులుతున్నారు. తాజాగా 2వ బ్యాచ్ భారత సిబ్బంది మాల్దీవులను వదిలిపెట్టినట్లు ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూ ప్రకటించారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సిబ్బంది మే 10 వరకు పూర్తిగా దేశాన్ని వదిలివెళ్తారని చెప్పారు.
Read Also: Anti Tank Missile: యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ డెవలప్మెంటల్ ట్రయల్స్ను పాస్ చేసిన డిఆర్డిఓ..!
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
భారత సిబ్బంది ఫస్ట్ బ్యాచ్ మార్చి 10లోగా మాల్దీవులను వదిలివెళ్లాలని గడువు పెట్టారు. ఏప్రిల్ 9న రెండో బ్యాచ్ భారత సైనికులు ఆ దేశాన్ని వదిలి వెళ్లారు. ఫిబ్రవరిలో మాల్దీవులు మరియు భారతదేశం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, భారతదేశం నుండి కూడా శిక్షణ పొందిన పౌరులను, ఆ దేశానికి బహుమతిగా ఇచ్చిన మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారతీయ సైనిక సిబ్బందిని భర్తీ చేయడానికి న్యూఢిల్లీ అంగీకరించింది. మాల్దీవుల ప్రభుత్వం ప్రకారం.. ఆ దేశంలో 88 మంది భారతీయ సైనిక సిబ్బంది అడ్డూ, లాము కధూలో హెలికాప్టర్లను, హనిమాధూలో ఒక డోర్నియర్ విమానాన్ని ఆపరేట్ చేస్తున్నారు.
గతేడాది అధికారంలోకి వచ్చిన ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నాడు. చైనాకు అనుకూలంగా ఉంటూ, ఆ దేశంలో పర్యటించి, జిన్పింగ్తో పలు ఒప్పందాలను చేసుకున్నాడు. చైనా మరియు మాల్దీవులు ఇటీవల రక్షణ సహకార ఒప్పందం మరియు అనేక ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సంతకం చేశాయి. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ లక్ష ద్వీప్ పర్యటన సమయంలో ఆ దేశ మంత్రులు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..