Maldives: మాల్దీవులను విడిచిపెట్టిన 2వ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది.. ప్రకటించిన మహ్మద్ ముయిజ్జూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక, చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను, మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిన పంపిస్తానని హామీ ఇచ్చాడు. దీనిపై భారత్-మాల్దీవుల మధ్య పలు చర్చలు జరిగాయి. చివరకు భారత సిబ్బంది ఆ దేశాన్ని వదులుతున్నారు. తాజాగా 2వ బ్యాచ్ భారత సిబ్బంది మాల్దీవులను వదిలిపెట్టినట్లు ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూ ప్రకటించారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సిబ్బంది మే 10 వరకు పూర్తిగా దేశాన్ని వదిలివెళ్తారని చెప్పారు.
Read Also: Anti Tank Missile: యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ డెవలప్మెంటల్ ట్రయల్స్ను పాస్ చేసిన డిఆర్డిఓ..!
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
భారత సిబ్బంది ఫస్ట్ బ్యాచ్ మార్చి 10లోగా మాల్దీవులను వదిలివెళ్లాలని గడువు పెట్టారు. ఏప్రిల్ 9న రెండో బ్యాచ్ భారత సైనికులు ఆ దేశాన్ని వదిలి వెళ్లారు. ఫిబ్రవరిలో మాల్దీవులు మరియు భారతదేశం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, భారతదేశం నుండి కూడా శిక్షణ పొందిన పౌరులను, ఆ దేశానికి బహుమతిగా ఇచ్చిన మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారతీయ సైనిక సిబ్బందిని భర్తీ చేయడానికి న్యూఢిల్లీ అంగీకరించింది. మాల్దీవుల ప్రభుత్వం ప్రకారం.. ఆ దేశంలో 88 మంది భారతీయ సైనిక సిబ్బంది అడ్డూ, లాము కధూలో హెలికాప్టర్లను, హనిమాధూలో ఒక డోర్నియర్ విమానాన్ని ఆపరేట్ చేస్తున్నారు.
గతేడాది అధికారంలోకి వచ్చిన ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నాడు. చైనాకు అనుకూలంగా ఉంటూ, ఆ దేశంలో పర్యటించి, జిన్పింగ్తో పలు ఒప్పందాలను చేసుకున్నాడు. చైనా మరియు మాల్దీవులు ఇటీవల రక్షణ సహకార ఒప్పందం మరియు అనేక ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సంతకం చేశాయి. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ లక్ష ద్వీప్ పర్యటన సమయంలో ఆ దేశ మంత్రులు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!