Maldives: మాల్దీవులను విడిచిపెట్టిన 2వ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది.. ప్రకటించిన మహ్మద్ ముయిజ్జూ..
Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక, చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను, మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిన పంపిస్తానని హామీ ఇచ్చాడు. దీనిపై భారత్-మాల్దీవుల మధ్య పలు చర్చలు జరిగాయి. చివరకు భారత సిబ్బంది ఆ దేశాన్ని వదులుతున్నారు. తాజాగా 2వ బ్యాచ్ భారత సిబ్బంది మాల్దీవులను వదిలిపెట్టినట్లు ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూ ప్రకటించారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సిబ్బంది మే 10 వరకు పూర్తిగా దేశాన్ని వదిలివెళ్తారని చెప్పారు.
Read Also: Anti Tank Missile: యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ డెవలప్మెంటల్ ట్రయల్స్ను పాస్ చేసిన డిఆర్డిఓ..!
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
భారత సిబ్బంది ఫస్ట్ బ్యాచ్ మార్చి 10లోగా మాల్దీవులను వదిలివెళ్లాలని గడువు పెట్టారు. ఏప్రిల్ 9న రెండో బ్యాచ్ భారత సైనికులు ఆ దేశాన్ని వదిలి వెళ్లారు. ఫిబ్రవరిలో మాల్దీవులు మరియు భారతదేశం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, భారతదేశం నుండి కూడా శిక్షణ పొందిన పౌరులను, ఆ దేశానికి బహుమతిగా ఇచ్చిన మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారతీయ సైనిక సిబ్బందిని భర్తీ చేయడానికి న్యూఢిల్లీ అంగీకరించింది. మాల్దీవుల ప్రభుత్వం ప్రకారం.. ఆ దేశంలో 88 మంది భారతీయ సైనిక సిబ్బంది అడ్డూ, లాము కధూలో హెలికాప్టర్లను, హనిమాధూలో ఒక డోర్నియర్ విమానాన్ని ఆపరేట్ చేస్తున్నారు.
గతేడాది అధికారంలోకి వచ్చిన ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నాడు. చైనాకు అనుకూలంగా ఉంటూ, ఆ దేశంలో పర్యటించి, జిన్పింగ్తో పలు ఒప్పందాలను చేసుకున్నాడు. చైనా మరియు మాల్దీవులు ఇటీవల రక్షణ సహకార ఒప్పందం మరియు అనేక ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సంతకం చేశాయి. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ లక్ష ద్వీప్ పర్యటన సమయంలో ఆ దేశ మంత్రులు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాల్దీవుల ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?