Droupadi Murmu: రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ అత్యున్నత పదవి, రాజ్యంగ అత్యున్నత పదవిని స్వీకరించబోతున్నారు ద్రౌపది ముర్ము. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా సోమవారం పదవిని స్వీకరించనున్నారు. 21 గన్ సెల్యూల్స్ మధ్య పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10.15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. పదవీ స్వీకారం తరువాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
ఈ రోజు రాష్ట్రపతి పదవికి రామ్ నాథ్ కోవింద్ రాజీనామా చేయనున్నారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. అక్కడే కొత్త రాష్ట్రపతికి ఇంటర్ సర్వీసెక్ గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వనున్నారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: Chhattisgarh: పోలీస్ కానిస్టేబుల్ నిజాయితీ.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలు అప్పగింత
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు. దేశంలోనే తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తరువాత రెండో మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 64 శాతం మంది మద్దతు పొందారు. స్వాతంత్య్రం తరువాత జన్మించి… అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా పదవిని స్వీకరిస్తున్న మహిళగా ద్రౌపది ముర్ము రికార్డులకెక్కారు.
ఇదిలా ఉంటే శనివారం ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజాస్వామ్య గొప్పతనం గురించి భావోద్వేగ ప్రసంగం చేశారు రామ్ నాథ్ కోవింద్. దేశాభివృద్ధికి రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!