Droupadi Murmu: రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ అత్యున్నత పదవి, రాజ్యంగ అత్యున్నత పదవిని స్వీకరించబోతున్నారు ద్రౌపది ముర్ము. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా సోమవారం పదవిని స్వీకరించనున్నారు. 21 గన్ సెల్యూల్స్ మధ్య పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10.15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. పదవీ స్వీకారం తరువాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
ఈ రోజు రాష్ట్రపతి పదవికి రామ్ నాథ్ కోవింద్ రాజీనామా చేయనున్నారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. అక్కడే కొత్త రాష్ట్రపతికి ఇంటర్ సర్వీసెక్ గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వనున్నారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Chhattisgarh: పోలీస్ కానిస్టేబుల్ నిజాయితీ.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలు అప్పగింత
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు. దేశంలోనే తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తరువాత రెండో మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 64 శాతం మంది మద్దతు పొందారు. స్వాతంత్య్రం తరువాత జన్మించి… అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా పదవిని స్వీకరిస్తున్న మహిళగా ద్రౌపది ముర్ము రికార్డులకెక్కారు.
ఇదిలా ఉంటే శనివారం ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజాస్వామ్య గొప్పతనం గురించి భావోద్వేగ ప్రసంగం చేశారు రామ్ నాథ్ కోవింద్. దేశాభివృద్ధికి రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!