Droupadi Murmu: రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం
దేశ అత్యున్నత పదవి, రాజ్యంగ అత్యున్నత పదవిని స్వీకరించబోతున్నారు ద్రౌపది ముర్ము. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా సోమవారం పదవిని స్వీకరించనున్నారు. 21 గన్ సెల్యూల్స్ మధ్య పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10.15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. పదవీ స్వీకారం తరువాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
ఈ రోజు రాష్ట్రపతి పదవికి రామ్ నాథ్ కోవింద్ రాజీనామా చేయనున్నారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. అక్కడే కొత్త రాష్ట్రపతికి ఇంటర్ సర్వీసెక్ గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వనున్నారు.
Also Read
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
Read Also: Chhattisgarh: పోలీస్ కానిస్టేబుల్ నిజాయితీ.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలు అప్పగింత
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు. దేశంలోనే తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తరువాత రెండో మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 64 శాతం మంది మద్దతు పొందారు. స్వాతంత్య్రం తరువాత జన్మించి… అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా పదవిని స్వీకరిస్తున్న మహిళగా ద్రౌపది ముర్ము రికార్డులకెక్కారు.
ఇదిలా ఉంటే శనివారం ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజాస్వామ్య గొప్పతనం గురించి భావోద్వేగ ప్రసంగం చేశారు రామ్ నాథ్ కోవింద్. దేశాభివృద్ధికి రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో