MK Stalin: మమ్మల్ని రెచ్చగొట్టొద్దు.. బీజేపీకి స్టాలిన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి చెందిన మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణను పెంచాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీని హెచ్చరిస్తూ సందేశం పంపాడు సీఎం స్టాలిన్. ‘‘మమ్మల్ని రెచ్చగొట్టకండి. డీఎంకే లేదా దాని కార్యకర్తలను రెచ్చగొట్టవద్దు. ఇది బెదిరింపు కాదు హెచ్చరిక’’ అంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చాడు.
పదేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై తొందరపడి బాలాజీని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. తాను దర్యాప్తును తప్పు అని చెప్పడం లేదని, కానీ అతను సామాన్య వ్యక్తి కాదని, ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి అని, అతడిని ఉగ్రవాదిలా లాక్కెళ్లి ఎందుకు ప్రశ్నించాలి..? అని స్టాలిన్ ప్రశ్నించారు. సెంథిల్ బాలాజీపై ఈడీ ఒత్తడి తెచ్చిందని.. దీంతోనే అతడికి ఛాతి నొప్పి వచ్చిందని స్టాలిన్ అన్నారు.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
Read Also: Cyclone Biparjoy: తీరాన్ని తాకిన పెను తుఫాన్.. 50 కి.మీ వ్యాసంతో “సైక్లోన్ ఐ”
ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు బీజేపీని వ్యతిరేకించే వారిపైనే జరుగుతున్నాయని, బెదిరించే వ్యూహాల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. బీజేపీకి బెదిరించడం అలవాటుగా మారిందని, వివిధ రాష్ట్రాల్లోని ఒకే స్క్రిప్టుతో భారతదేశం అంతటా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. శివసేన వ్యతిరేకిస్తే సంజయ్ రౌత్ ని అరెస్ట్ చేశారు, ఆప్ వ్యతిరేకిస్తే మనిష్ సిసోడియాను అరస్ట్ చేశారు, బీమార్ లో తేజస్వీ యాదవ్ పై దాడులు నిర్వహించారని ఆయన అన్నారు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి, అతడిని అరెస్ట్ చేసింది. ఉద్యోగానికి నగదు కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కి పాల్పడినట్లు సెంథిల్ పై అభియోగాలు ఉన్నాయి. రాష్ట్ర రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లతో కలిసి ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకునేందుకు సెంథిల్ బాలాజీ ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ తన రిమాండ్ నోట్లో పేర్కొంది. డ్రైవర్లు, కండక్టర్లు, జూనియర్ ట్రేడ్స్మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్లు తదితర ఉద్యోగాల్లో అభ్యర్థులను నియమించుకునేందుకు బాలాజీ అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది.
- Tags
- bjp
- CM MK Stalin
- DMK
- ED
- Senthil Balaji
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!