MK Stalin: మమ్మల్ని రెచ్చగొట్టొద్దు.. బీజేపీకి స్టాలిన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి చెందిన మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణను పెంచాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీని హెచ్చరిస్తూ సందేశం పంపాడు సీఎం స్టాలిన్. ‘‘మమ్మల్ని రెచ్చగొట్టకండి. డీఎంకే లేదా దాని కార్యకర్తలను రెచ్చగొట్టవద్దు. ఇది బెదిరింపు కాదు హెచ్చరిక’’ అంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చాడు.
పదేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై తొందరపడి బాలాజీని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. తాను దర్యాప్తును తప్పు అని చెప్పడం లేదని, కానీ అతను సామాన్య వ్యక్తి కాదని, ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి అని, అతడిని ఉగ్రవాదిలా లాక్కెళ్లి ఎందుకు ప్రశ్నించాలి..? అని స్టాలిన్ ప్రశ్నించారు. సెంథిల్ బాలాజీపై ఈడీ ఒత్తడి తెచ్చిందని.. దీంతోనే అతడికి ఛాతి నొప్పి వచ్చిందని స్టాలిన్ అన్నారు.
Also Read
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
Read Also: Cyclone Biparjoy: తీరాన్ని తాకిన పెను తుఫాన్.. 50 కి.మీ వ్యాసంతో “సైక్లోన్ ఐ”
ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు బీజేపీని వ్యతిరేకించే వారిపైనే జరుగుతున్నాయని, బెదిరించే వ్యూహాల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. బీజేపీకి బెదిరించడం అలవాటుగా మారిందని, వివిధ రాష్ట్రాల్లోని ఒకే స్క్రిప్టుతో భారతదేశం అంతటా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. శివసేన వ్యతిరేకిస్తే సంజయ్ రౌత్ ని అరెస్ట్ చేశారు, ఆప్ వ్యతిరేకిస్తే మనిష్ సిసోడియాను అరస్ట్ చేశారు, బీమార్ లో తేజస్వీ యాదవ్ పై దాడులు నిర్వహించారని ఆయన అన్నారు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి, అతడిని అరెస్ట్ చేసింది. ఉద్యోగానికి నగదు కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కి పాల్పడినట్లు సెంథిల్ పై అభియోగాలు ఉన్నాయి. రాష్ట్ర రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లతో కలిసి ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకునేందుకు సెంథిల్ బాలాజీ ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ తన రిమాండ్ నోట్లో పేర్కొంది. డ్రైవర్లు, కండక్టర్లు, జూనియర్ ట్రేడ్స్మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్లు తదితర ఉద్యోగాల్లో అభ్యర్థులను నియమించుకునేందుకు బాలాజీ అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది.
- Tags
- bjp
- CM MK Stalin
- DMK
- ED
- Senthil Balaji
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..