MK Stalin: మమ్మల్ని రెచ్చగొట్టొద్దు.. బీజేపీకి స్టాలిన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి చెందిన మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణను పెంచాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీని హెచ్చరిస్తూ సందేశం పంపాడు సీఎం స్టాలిన్. ‘‘మమ్మల్ని రెచ్చగొట్టకండి. డీఎంకే లేదా దాని కార్యకర్తలను రెచ్చగొట్టవద్దు. ఇది బెదిరింపు కాదు హెచ్చరిక’’ అంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చాడు.
పదేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై తొందరపడి బాలాజీని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. తాను దర్యాప్తును తప్పు అని చెప్పడం లేదని, కానీ అతను సామాన్య వ్యక్తి కాదని, ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి అని, అతడిని ఉగ్రవాదిలా లాక్కెళ్లి ఎందుకు ప్రశ్నించాలి..? అని స్టాలిన్ ప్రశ్నించారు. సెంథిల్ బాలాజీపై ఈడీ ఒత్తడి తెచ్చిందని.. దీంతోనే అతడికి ఛాతి నొప్పి వచ్చిందని స్టాలిన్ అన్నారు.
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
Read Also: Cyclone Biparjoy: తీరాన్ని తాకిన పెను తుఫాన్.. 50 కి.మీ వ్యాసంతో “సైక్లోన్ ఐ”
ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు బీజేపీని వ్యతిరేకించే వారిపైనే జరుగుతున్నాయని, బెదిరించే వ్యూహాల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. బీజేపీకి బెదిరించడం అలవాటుగా మారిందని, వివిధ రాష్ట్రాల్లోని ఒకే స్క్రిప్టుతో భారతదేశం అంతటా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. శివసేన వ్యతిరేకిస్తే సంజయ్ రౌత్ ని అరెస్ట్ చేశారు, ఆప్ వ్యతిరేకిస్తే మనిష్ సిసోడియాను అరస్ట్ చేశారు, బీమార్ లో తేజస్వీ యాదవ్ పై దాడులు నిర్వహించారని ఆయన అన్నారు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి, అతడిని అరెస్ట్ చేసింది. ఉద్యోగానికి నగదు కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కి పాల్పడినట్లు సెంథిల్ పై అభియోగాలు ఉన్నాయి. రాష్ట్ర రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లతో కలిసి ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకునేందుకు సెంథిల్ బాలాజీ ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ తన రిమాండ్ నోట్లో పేర్కొంది. డ్రైవర్లు, కండక్టర్లు, జూనియర్ ట్రేడ్స్మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్లు తదితర ఉద్యోగాల్లో అభ్యర్థులను నియమించుకునేందుకు బాలాజీ అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది.
- Tags
- bjp
- CM MK Stalin
- DMK
- ED
- Senthil Balaji
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!