Cyclone Biparjoy: తీరాన్ని తాకిన పెను తుఫాన్.. 50 కి.మీ వ్యాసంతో “సైక్లోన్ ఐ”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ‘బిపార్జాయ్’ గుజరాత్ తీరాన్ని తాకింది. గుజరాత్ లోని జఖౌ ఓడరేవు సమీపంలో, పాకిస్తాన్ లోని కరాచీ తీరాల మధ్య తుఫాన్ తీరాన్ని దాటుతోంది. ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో బలమైన గాలులతో వర్షాలు ప్రారంభమయ్యాయి. తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఈ తీరందాటే ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ( ఐఎండీ ) తెలిపింది. పోర్ బందర్, ద్వారక, జామ్ నగర్, మోర్బీ జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం అలలు 3-6 మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి.
Read Also: North Korea: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.. ధృవీకరించిన జపాన్
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
‘తుఫాన్ కన్ను’ (సైక్లోన్ ఐ) ప్రాంతం దాదాపుగా 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్నట్లు అదికారులు తెలిపారు. ఇది ఈ అర్థరాత్రి తీరాన్ని తాకుతుందని తెలిపారు. తుఫాన్ మధ్యలో ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ‘ సైక్లోన్ ఐ’గా పేర్కొంటారు. తుఫాన్ ముందుగా విధ్వంసం సృష్టించిన తర్వాత ఈ కంటి ప్రాంతం తీరాన్ని దాటుతుంది. ఆ సమయంలో ఎలాంటి గాలులు, వర్షం లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆ తరువాత తుఫాన్ కు సంబంధించిన దట్టమైన మేఘాలతో కూడిన అల్పపీడన ప్రాంతం, ప్రచండ గాలులతో మరోసారి విధ్వంసం సృష్టిస్తూ తీరాన్ని దాటుతుంది.
అయితే ప్రశాంతంగా ఉందని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ప్రశాంతం తరువాత మరోసారి వర్షం, గాలులు విరుచుకుపడుతాయని తెలిపారు. గుజారాత్ రాష్ట్రంలోని మాండ్వీ, పాకిస్తాన్ లోని కరాచీల మధ్య తుఫాన్ తీరం దాటుతోంది. గుజరాత్ లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలను తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా లక్ష మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత శిబిరాలకు తరలించారు.
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!