Cyclone Biparjoy: తీరాన్ని తాకిన పెను తుఫాన్.. 50 కి.మీ వ్యాసంతో “సైక్లోన్ ఐ”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ‘బిపార్జాయ్’ గుజరాత్ తీరాన్ని తాకింది. గుజరాత్ లోని జఖౌ ఓడరేవు సమీపంలో, పాకిస్తాన్ లోని కరాచీ తీరాల మధ్య తుఫాన్ తీరాన్ని దాటుతోంది. ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో బలమైన గాలులతో వర్షాలు ప్రారంభమయ్యాయి. తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఈ తీరందాటే ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ( ఐఎండీ ) తెలిపింది. పోర్ బందర్, ద్వారక, జామ్ నగర్, మోర్బీ జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం అలలు 3-6 మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి.
Read Also: North Korea: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.. ధృవీకరించిన జపాన్
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
‘తుఫాన్ కన్ను’ (సైక్లోన్ ఐ) ప్రాంతం దాదాపుగా 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్నట్లు అదికారులు తెలిపారు. ఇది ఈ అర్థరాత్రి తీరాన్ని తాకుతుందని తెలిపారు. తుఫాన్ మధ్యలో ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ‘ సైక్లోన్ ఐ’గా పేర్కొంటారు. తుఫాన్ ముందుగా విధ్వంసం సృష్టించిన తర్వాత ఈ కంటి ప్రాంతం తీరాన్ని దాటుతుంది. ఆ సమయంలో ఎలాంటి గాలులు, వర్షం లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆ తరువాత తుఫాన్ కు సంబంధించిన దట్టమైన మేఘాలతో కూడిన అల్పపీడన ప్రాంతం, ప్రచండ గాలులతో మరోసారి విధ్వంసం సృష్టిస్తూ తీరాన్ని దాటుతుంది.
అయితే ప్రశాంతంగా ఉందని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ప్రశాంతం తరువాత మరోసారి వర్షం, గాలులు విరుచుకుపడుతాయని తెలిపారు. గుజారాత్ రాష్ట్రంలోని మాండ్వీ, పాకిస్తాన్ లోని కరాచీల మధ్య తుఫాన్ తీరం దాటుతోంది. గుజరాత్ లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలను తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా లక్ష మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత శిబిరాలకు తరలించారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!