PM Modi: దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే.. పాకిస్తాన్ చేతిలో “బాంబు”లకు బదులు “భిక్షాటన గిన్నె” ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇటీవల పాకిస్తాన్ని, పీఓకేని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూఖ్ అబ్దుల్లాలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ వారి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వీరిద్దరు చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం హర్యానా అంబాలాలో విరుచుకుపడ్డారు. దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే, శత్రువు కూడా ఏదైనా చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు అని అన్నారు. ప్రస్తుతం అదే పాకిస్తాన్ని కలవరపెడుతోందని ప్రధాని మోడీ అన్నారు. 70 ఏళ్లుగా తమ చేతిలో బాంబులు పెట్టుకుని, ఇప్పుడు భిక్షాటన గిన్నె పట్టుకుని ఉన్నారని, ఇది బలమైన ప్రభుత్వం వల్లే సాధ్యమైనందని, శత్రువులు ఇలాగే వణికిపోతారని ప్రధాని చెప్పారు.
Read Also: Air india: తమిళనాడులో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
బలహీనమైన ప్రభుత్వం ఉంటే జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని మార్చగలిగేదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఉగ్రవాదుల దాడుల్లో, రాళ్ల దాడుల్లో మన సైనికులు గాయపడటం చూసి హర్యానాలోని తల్లులు ఆందోళన చెందే వారని, గత 10 ఏళ్ల కాలంలో ఇదంతా ఆపగలిగాం అని, బలమైన ప్రభుత్వం ఆర్టికల్ 370ని బద్ధలు కొట్టిందని, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉందని ప్రధాని అన్నారు.
ఇటీవల పీఓకేని భారత్ స్వాధీనం చేసుకుంటుందనే బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి, మనం వారిని గౌరవించాలి, లేకపోతే భారత్పై వారు అణుబాంబు ప్రయోగించాలని ఆలోచిస్తారు, మీరు వారితో చర్చించాలి, కానీ సైనిక శక్తిని పెంచుతున్నామని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ పీఓకేని తీసుకుంటే పాకిస్తాన్ గాజులు తొడుక్కుని లేదని, వారి వద్ద అణుబాంబులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. హర్యానాలో మొత్తం 10 స్థానాలకు మే 25న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!