Maharashtra Cabinet: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఢిల్లీకి మహాయుతి నేతలు!
- మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తోన్న ఫడ్నవీస్, అజిత్ పవార్..
- మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకపోవడంతో ముంబైని వీడిన ఏక్నాథ్ షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. డిసెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ సహా అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, మంత్రి పదవుల పంపకంపై బీజేపీ నాయకత్వంతో చర్చలు జరపడానికి ఇప్పటికే మహయుతి నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. కాగా, NCP (ఏపీ) అధినేత అజిత్ పవార్ దేశ రాజధానిలో ఉండగా.. సీఎం ఫడ్నవీస్ సైతం గత రాత్రి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలను కలిశారు. అయితే, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన శివసేన(షిండే) చీఫ్ ఏక్నాథ్ షిండే గత వారం రోజులుగా ముంబైలో కనిపించడం లేదు.
Read Also: Avanthi Srinivas Resign To YCP: వైసీపీకి రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అవంతి
Also Read
- West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
- Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
- LPG New Rules: ఎల్పీజీ సిలిండర్ న్యూ రూల్స్.. 90 రోజుల గడువు ముగిసింది! ఈ ముఖ్యమైన పనిని ఈరోజే పూర్తి చేయండి
అయితే, మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ బెర్తులు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతంది. ఇందులో బీజేపీకి సీఎంతో పాటు 21-22 మంత్రి పదవులు దక్కనుండగా, శివసేనకు 12, ఎన్సీపీ నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం దక్కనుందని ప్రచారం అవుతుంది. ఇక, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 43 మంది మంత్రులుగా ఉండవచ్చు. కానీ, హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ మద్దతు మాత్రమే అవసరం కాబట్టి షిండేకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమాచారం. సర్కార్ ఏర్పాటులో తాను అడ్డం కానని.. డిసెంబర్ 5న డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏక్నాథ్ షిండే బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనలో లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.
తాజావార్తలు
-
Personal Loans: ఒక లోన్ క్లియర్ చేయడానికి మరో లోన్ తీసుకుంటున్నారా? షాకింగ్ ఫాక్ట్స్
-
West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
-
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్పై మాజీమంత్రి అంబటి ఫైర్
-
CM Revanth Reddy: రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
-
Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!