Maharashtra Cabinet: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఢిల్లీకి మహాయుతి నేతలు!
- మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తోన్న ఫడ్నవీస్, అజిత్ పవార్..
- మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకపోవడంతో ముంబైని వీడిన ఏక్నాథ్ షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. డిసెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ సహా అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, మంత్రి పదవుల పంపకంపై బీజేపీ నాయకత్వంతో చర్చలు జరపడానికి ఇప్పటికే మహయుతి నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. కాగా, NCP (ఏపీ) అధినేత అజిత్ పవార్ దేశ రాజధానిలో ఉండగా.. సీఎం ఫడ్నవీస్ సైతం గత రాత్రి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలను కలిశారు. అయితే, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన శివసేన(షిండే) చీఫ్ ఏక్నాథ్ షిండే గత వారం రోజులుగా ముంబైలో కనిపించడం లేదు.
Read Also: Avanthi Srinivas Resign To YCP: వైసీపీకి రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అవంతి
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
అయితే, మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ బెర్తులు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతంది. ఇందులో బీజేపీకి సీఎంతో పాటు 21-22 మంత్రి పదవులు దక్కనుండగా, శివసేనకు 12, ఎన్సీపీ నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం దక్కనుందని ప్రచారం అవుతుంది. ఇక, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 43 మంది మంత్రులుగా ఉండవచ్చు. కానీ, హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ మద్దతు మాత్రమే అవసరం కాబట్టి షిండేకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమాచారం. సర్కార్ ఏర్పాటులో తాను అడ్డం కానని.. డిసెంబర్ 5న డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏక్నాథ్ షిండే బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనలో లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!