PAK : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పాక్ లో ప్రాయాణికుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానాన్ని పాకిస్తాన్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్ని వచ్చింది. ఓ ప్రయాణికుడికి హెల్త్ ఇష్యూ రావడంతో విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు. సోమవారం ఉదయం 8.41 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుంచి ఇండిగో 6ఈ-1736 బయల్దేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడికి ఆరోగ్య పరమైన సమస్య తలెత్తింది. పరిస్థితి విషమించడంతో విమానాన్ని కిందకు దించాల్సి వచ్చింది. దీంతో ఇండిగో విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో దించారు. దురదృష్టవశాత్తు విమానం ఆకాశంలోనే ఉండగానే సదరు ప్రయాణికుడి ప్రాణాలు కోల్పోయాడు. కరాచీ ఎయిర్ పోర్ట్ వైద్య సిబ్బంది ఈ మేరకు ధ్రువీకరించారు.
Also Read : Minister Harish rao: కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి.. వైద్య సేవలపై ఆరా
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఢిల్లీ నుంచి బయల్దేరిన విమానంలో 11 గంటలకు ఖతార్ చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం బయల్దేరిన కొద్ది సేపటికే అబ్దుల్లా అనే 60 ఏళ్ల నైజీరియన్ ప్రయాణికుడి ఆరోగ్యం బాగా విషమించింది. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది.. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే విమానం కరాచీలో ల్యాండ్ అయ్యేలోపే ఆ ప్రయాణికుడు మరణించాడు. కరాచీ వైద్య సిబ్బంది సైతం అతను మరణించినట్లు వెల్లడించారు. దాదాపు 5 గంటల పాటు విమానాన్ని కరాచీలోనే ఉంచి అధికారులు సంబంధిత ప్రక్రియలన్నీ పూర్తి చేశారు. అన్ని లాంఛనాలు పూర్తైన తర్వాత ఆ ఇండిగో విమానం తిరిగి ఢిల్లీకి బయల్దేరినట్లు అధికారులు తెలిపారు.
Also Read : Revanth Reddy: కవిత పై బండి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావు
ఈ ఘటనపై ఇండిగో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయాన్ని మాత్రం ఎయిర్ లైన్ అధికారులు వెల్లడించలేదు.. ప్రస్తుతం విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులను దోహా పంపించేందుకు ప్రయత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి మరణానికి గల కారణాలపై పూర్తి స్పష్టత రాలేదు. త్వరలోనే అబ్దుల్లా మృతికి గల కారణాలు వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!