Delhi Assembly: అసెంబ్లీలోకి బీజేపీ ప్రభుత్వం రానివ్వడం లేదు.. ఆప్ సంచలన ఆరోపణలు
- ఢిల్లీ అసెంబ్లీలోకి బీజేపీ ప్రభుత్వం రానివ్వడం లేదు
- ఆప్ సంచలన ఆరోపణలు.. ట్విట్టర్లో అతిషి ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల వేదికగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి వాడీవేడీగానే జరుగుతోంది. ఇటీవల గత ప్రభుత్వ పాలనపై కాగ్ రిపోర్టును ముఖ్యమంత్రి రేఖా గుప్తా సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అతిషి సహా 21 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ విజేందర్ గుప్తా.. మూడు రోజులు సస్పెండ్ చేశారు. అయితే గురువారం సభలోకి వెళ్లేందుకు ఆప్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. బారికేడ్లు అడ్డుపెట్టి రానివ్వకుండా చేశారని అతిషి ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. స్పీకర్ అనుమతి లేకుండా లోపలికి అనుమతించబోమని పోలీసులు తెలిపారు.

Also Read
- NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
- Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
- Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
బీజేపీ అధికారంలోకి రాగానే నియంతృత్వం హద్దులు దాటేసిందని అతిషి ఆరోపించారు. సభలో జై బీమ్ నినాదాలు చేసినందుకు మూడు రోజుల పాటు ఆప్ ఎమ్మె్ల్యేలను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏకంగా సభలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని.. ఇలాంటి దారుణం ఎన్నడూ చూడలేదని అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల బీజేపీ ప్రభుత్వం 2021-2022లో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కారణంగా రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ రిపోర్టును బయటపెట్టింది. అయితే ఈ రిపోర్టును ఆప్ ఖండించింది.
ఇది కూడా చదవండి: IPL 2025 MS Dhoni: మొదలైన ఐపీఎల్ సందడి.. చెన్నైలో అడుగుపెట్టిన మిస్టర్ కూల్
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను గెలుచుకున్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలంతా ఓటమి పాలయ్యారు. లిక్కర్ స్కామ్ భారీగా పార్టీని నష్టపరిచింది.
ఇది కూడా చదవండి: Posani KrishnaMurali Arrest: ఓబులవారిపల్లె పీఎస్లో పోసాని.. కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టుకు!
తాజావార్తలు
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
-
Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
-
Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!