IPL 2025 MS Dhoni: మొదలైన ఐపీఎల్ సందడి.. చెన్నైలో అడుగుపెట్టిన మిస్టర్ కూల్
- మొదలైన ఐపీఎల్ 2025 సందడి..
- చెన్నైలో అడుగుపెట్టిన మిస్టర్ కూల్ ఎమ్ఎస్ ధోని.
- స్వాగతం పలికిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా గుర్తింపు పొందాడు. “కూల్ కెప్టెన్” గా పేరుగాంచిన ధోనీ తన అద్భుతమైన నాయకత్వంతో భారత జట్టుకు 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ధోనీ బౌలర్లను సమర్థంగా మేనేజ్ చేయడంలోనూ, కీలక సమయాల్లో మ్యాచ్ ను మార్చే సత్తా కలిగిన ఆటగాడిగా ఉండటంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. క్రికెట్ లో అతని తెలివితేటలు, స్టంపింగ్ స్పీడ్, ఆటలో కూల్ మైండ్ సెట్ గురించి చెప్పుకుంటూ ఉండగానే.. ఇప్పుడు 2025 ఐపీఎల్ కోసం మహీ మళ్లీ సిద్ధమవుతున్నాడు.
Read Also: Chitti Fraud: చిట్టిల పేరుతో కుచ్చుటోపి.. ఏకంగా 500 మందిని మోసం చేసిన పుల్లయ్య..
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ధోనీ ఐపీఎల్ 2025 కోసం సన్నద్ధమయ్యాడు. తాజాగా అతడు సీఎస్కే హోం టౌన్ చెన్నైకి చేరుకున్నాడు. దీంతో అతడికి చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం అందించారు. సీఎస్కే అధికారిక సోషల్ మీడియా పేజ్ లో ధోనీ చెన్నై చేరుకున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో, కళ్లజోడు పెట్టుకుని ఎంతో కూల్ గా నడుస్తున్న మహీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే మహీ తన సింప్లిసిటీతో అభిమానులను ఆకట్టుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు త్వరలోనే ఐపీఎల్ కోసం ట్రైనింగ్ క్యాంప్ ను ప్రారంభించనుంది. ఇందులో పాల్గొనేందుకు ధోనీ చెన్నై చేరుకున్నాడు. మహీతో పాటు మరోకొంత మంది ఆటగాళ్లు కూడా ఈ క్యాంప్ లో ప్రాక్టీస్ చేయనున్నారు. చెన్నైకు చేరుకున్న ధోనీకి జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వాగతం పలికాడు. ఇద్దరూ కౌగిలించుకుని కాసేపు ముచ్చటించుకున్నారు. ధోనీ తన అనుభవాన్ని యువ ఆటగాళ్లకు పంచుతాడన్న నమ్మకంతో సీఎస్కే అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
Read Also: KTR: రేవంత్రెడ్డి ధన దాహం వల్లే.. ప్రమాదంలో 8 మంది కార్మికుల ప్రాణాలు!
2025 ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది. ఈ సారి ధోనీ కేవలం మెంటార్ రోల్ లో ఉండగా, రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ లో ఐదు ట్రోఫీలను గెలుచుకున్న సీఎస్కే, ఈసారి కూడా టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. ధోనీ ప్రత్యేకంగా తక్కువ బరువున్న బ్యాట్లను తయారు చేయించుకున్నాడు. ధోనీ ఐపీఎల్ ను వీడినా, సీఎస్కే అభిమానుల మనసుల్లో అతను ఎప్పటికీ అలా నిలిచిపోతాడు. అతని నాయకత్వంలో జట్టు విజయాలను సొంతం చేసుకున్న తీరును చూసి ఇప్పటికీ కొత్త ఆటగాళ్లు స్పూర్తి పొందుతున్నారు. ఇక ధోనీ 2025 సీజన్ లో ఎంతవరకు తన మేజిక్ కొనసాగిస్తాడో చూడాలి. సీఎస్కే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే మళ్లీ “ధోనీ.. ధోనీ” అంటూ స్టేడియంని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.
MS DHONI MEETS RUTURAJ GAIKWAD IN CHENNAI. ❤️pic.twitter.com/wo6cghIGPM
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2025
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?