Land for jobs Scam: మనీ లాండరింగ్ కేసులో లాలూ, తేజస్వినీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
- మనీ లాండరింగ్ కేసులో లాలూ ప్రసాద్.. తేజస్వినీ యాదవ్కు నోటీసులు..
- లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో జరిగిన ‘భూమికి ఉద్యోగం కుంభకోణం..
- భూమికి ఉద్యోగం కుంభకోణంతో లింక్ ఉన్న అందరికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land for jobs Scam: మనీ లాండరింగ్ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వినీ యాదవ్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న టైంలో జరిగిన ‘భూమికి ఉద్యోగం కుంభకోణంతో సంబంధమున్న మనీలాండరింగ్ స్కామ్ కేసులో కోర్టు సమన్లు జారీ చేసింది. ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్కు డైరెక్టర్ ప్రతాప్ యాదవ్కు, మరికొందరికి కూడా న్యాయస్థానం నోటీసులు పంపింది. అక్టోబరు 7వ తేదీ లోపు తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: BJP MP Laxman: ప్రధాని మోడీ వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే..
Also Read
కాగా, 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన టైంలో భారతీయ రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. ఇదే వ్యవహారంపై నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం కింద ఈడీ కేసు ఫైల్ చేసింది. గతేడాది మార్చిలో ఢిల్లీ, బీహార్, ముంబయిలలో మొత్తం 25 చోట్ల తనిఖీలు చేపట్టింది. ఆ తర్వాత లాలూ కుటుంబసభ్యులు ముగ్గురితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల పేర్లతో ఛార్జిషీట్ను సీబీఐ రూపొందించింది. లాలూ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్, లాలూ సన్నిహితుడు అమిత్ కత్యాల్, రైల్వే ఉద్యోగితో పాటు లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానంద్లతో పాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్పోర్ట్స్లపై అభియోగాలను మోపింది.
తాజావార్తలు
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!