Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News D Fadnavis Calls Nagpur Violence A Conspiracy

Nagpur Violence: నాగ్‌పూర్ హింస ఒక “కుట్ర”.. “ఛావా”పై షిండే కామెంట్స్..

Published Date :March 18, 2025 , 3:11 pm
By BV Reddy
  • ‌నాగ్‌పూర్ హింస ఒక కుట్ర: దేవేంద్ర ఫడ్నవీస్..
  • ‘ఔరంగజేబు ఎవరు? ఆయన సాధువా..?’’: ఏక్ నాథ్ షిండే..
  • హింసకు పాల్పడిన వారిని వదిలేది లేదన్న ప్రభుత్వం..
Nagpur Violence: నాగ్‌పూర్ హింస ఒక “కుట్ర”.. “ఛావా”పై షిండే కామెంట్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nagpur Violence: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రలో అగ్గిరాజేస్తోంది. నాగ్‌పూర్‌లో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒక్కసారి ముస్లిం మూక దాడులకు పాల్పడింది. దీంతో నగరంలో హింస చెలరేగింది. ప్రైవేట్ ఆస్తులు, వాహనాలు, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ అల్లర్లు జరిగాయి. ఇదిలా ఉంటే, ఈ అల్లర్లపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు ‘‘కుట్ర’’ ప్రకారం జరిగాయని, మణిపూర్ జాతి ఘర్షణలను ప్రస్తావిస్తూ సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ‘‘నిర్ధిష్ట ఇళ్లు, స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ముందస్తుగా కుట్ర పన్నారు’’అని షిండే అన్నారు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ, ఔరంగజేబు మొఘల్ దళాల మధ్య జరిగిన యుద్ధం గురించి ‘‘ఛావా’’ సినిమా ప్రజల కోపాన్ని రగిలించిందని అన్నారు.

సోమవారం సాయంత్రం వ్యాప్తించిన పుకార్లే హింసకు కారణమని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. ‘‘ఒక రాళ్ల ట్రాలీ వచ్చింది, ఇది ప్లాన్‌ని సూచిస్తుంది. నిర్దిష్ట ఇళ్లు, సంస్థల్ని లక్ష్యంగా చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్‌పై గొడ్డలితో దాడి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిని వదిలిపెట్టేది లేదు. పోలీసులపై హింసను సహించము’’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ‘‘విశ్వహిందూ పరిషత్ ఔరంగజేబు సామాధిని తొలగించాలని ఆందోళన నిర్వమించింది. గడ్డితో చేసిన ఒక నమూనా సమాధిని తగులబెట్టారు. అయితే, సమాధిపై మతపరమైన వ్యాఖ్యలు ఉన్నాయనే పుకార్లు వ్యాప్తించాయి. నమాజ్ తర్వాత 250 మంది జన సమూహం నినాదాలు చేయడం ప్రారంభించింది.’’ అని జరిగిన సంఘటనా క్రమాన్ని సీఎం చెప్పారు. వీహెచ్‌పీపై ముస్లింల ఫిర్యాదుని అంగీకరించినట్లు తెలిపారు.

Read Also: MLAs’ Wealth Analysis: దేశంలో 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు.. ఈ 3 రాష్ట్రాలలోనే అధికం…

మరోవైపు, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా సీఎం ఫడ్నవీస్‌కి మద్దతు ఇచ్చారు. ఒక నిర్ధి్ష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ముందస్తుగా కుట్ర పన్నారని ఆరోపించారు. అసెంబ్లీ వెలుపల షిండే మాట్లాడుతూ.. దేశభక్తులైన ముస్లింలు ఔరంగజేబుకు ఎప్పటికీ మద్దతు ఇవ్వరని అన్నారు. ఆయనను ప్రశంసించే వారు దేశద్రోహులని, ఛత్రపతి శంభాజీ నగర్‌( ఔరంగాబాద్) లోని ఔరంగజేబు సమాధి మహారాష్ట్రకు మచ్చ అని తీవ్రంగా స్పందించారు. ‘‘ఔరంగజేబు ఎవరు? ఆయన సాధువా? ఆయన ఏదైనా మంచి పని చేశారా? ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర చదివి ‘ఛావా’ చూడాలి. వారు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను 40 రోజులు హింసించారు. ఔరంగజేబు ఒక దేశద్రోహి… ఛత్రపతి శంభాజీ మహారాజ్ గర్వం కోసం నిరసనకారులు నిరసన తెలుపుతున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శివసేన ఎంపీ నరేష్ మష్కే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో అల్లర్లు జరుగుతాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి, ఇది వారి కుట్రలా కనిపిస్తోందని అనుమానించారు. మరోవైపు, ఠాక్రే సేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రని మణిపూర్‌లా చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఠాక్రే సేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా ఇది బీజేపీ కుట్ర అంటూ ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aurangzeb tomb
  • Aurangzeb tomb controversy
  • Devendra Fadnavis
  • eknath shinde
  • Nagpur

తాజావార్తలు

  • Polavaram Tiger Alert: పోలవరం జిల్లాలో పులి సంచారం.. గిరిజన గ్రామాల్లో ఆందోళన!

  • Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..

  • Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

  • Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ

  • UK Visa: బ్రిటన్ బాదుడు.. భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions