Nagpur Violence: నాగ్పూర్ హింస ఒక “కుట్ర”.. “ఛావా”పై షిండే కామెంట్స్..
- నాగ్పూర్ హింస ఒక కుట్ర: దేవేంద్ర ఫడ్నవీస్..
- ‘ఔరంగజేబు ఎవరు? ఆయన సాధువా..?’’: ఏక్ నాథ్ షిండే..
- హింసకు పాల్పడిన వారిని వదిలేది లేదన్న ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur Violence: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రలో అగ్గిరాజేస్తోంది. నాగ్పూర్లో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒక్కసారి ముస్లిం మూక దాడులకు పాల్పడింది. దీంతో నగరంలో హింస చెలరేగింది. ప్రైవేట్ ఆస్తులు, వాహనాలు, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ అల్లర్లు జరిగాయి. ఇదిలా ఉంటే, ఈ అల్లర్లపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు ‘‘కుట్ర’’ ప్రకారం జరిగాయని, మణిపూర్ జాతి ఘర్షణలను ప్రస్తావిస్తూ సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ‘‘నిర్ధిష్ట ఇళ్లు, స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ముందస్తుగా కుట్ర పన్నారు’’అని షిండే అన్నారు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ, ఔరంగజేబు మొఘల్ దళాల మధ్య జరిగిన యుద్ధం గురించి ‘‘ఛావా’’ సినిమా ప్రజల కోపాన్ని రగిలించిందని అన్నారు.
సోమవారం సాయంత్రం వ్యాప్తించిన పుకార్లే హింసకు కారణమని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. ‘‘ఒక రాళ్ల ట్రాలీ వచ్చింది, ఇది ప్లాన్ని సూచిస్తుంది. నిర్దిష్ట ఇళ్లు, సంస్థల్ని లక్ష్యంగా చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్పై గొడ్డలితో దాడి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిని వదిలిపెట్టేది లేదు. పోలీసులపై హింసను సహించము’’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ‘‘విశ్వహిందూ పరిషత్ ఔరంగజేబు సామాధిని తొలగించాలని ఆందోళన నిర్వమించింది. గడ్డితో చేసిన ఒక నమూనా సమాధిని తగులబెట్టారు. అయితే, సమాధిపై మతపరమైన వ్యాఖ్యలు ఉన్నాయనే పుకార్లు వ్యాప్తించాయి. నమాజ్ తర్వాత 250 మంది జన సమూహం నినాదాలు చేయడం ప్రారంభించింది.’’ అని జరిగిన సంఘటనా క్రమాన్ని సీఎం చెప్పారు. వీహెచ్పీపై ముస్లింల ఫిర్యాదుని అంగీకరించినట్లు తెలిపారు.
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
Read Also: MLAs’ Wealth Analysis: దేశంలో 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు.. ఈ 3 రాష్ట్రాలలోనే అధికం…
మరోవైపు, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా సీఎం ఫడ్నవీస్కి మద్దతు ఇచ్చారు. ఒక నిర్ధి్ష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ముందస్తుగా కుట్ర పన్నారని ఆరోపించారు. అసెంబ్లీ వెలుపల షిండే మాట్లాడుతూ.. దేశభక్తులైన ముస్లింలు ఔరంగజేబుకు ఎప్పటికీ మద్దతు ఇవ్వరని అన్నారు. ఆయనను ప్రశంసించే వారు దేశద్రోహులని, ఛత్రపతి శంభాజీ నగర్( ఔరంగాబాద్) లోని ఔరంగజేబు సమాధి మహారాష్ట్రకు మచ్చ అని తీవ్రంగా స్పందించారు. ‘‘ఔరంగజేబు ఎవరు? ఆయన సాధువా? ఆయన ఏదైనా మంచి పని చేశారా? ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర చదివి ‘ఛావా’ చూడాలి. వారు ఛత్రపతి శంభాజీ మహారాజ్ను 40 రోజులు హింసించారు. ఔరంగజేబు ఒక దేశద్రోహి… ఛత్రపతి శంభాజీ మహారాజ్ గర్వం కోసం నిరసనకారులు నిరసన తెలుపుతున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శివసేన ఎంపీ నరేష్ మష్కే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో అల్లర్లు జరుగుతాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి, ఇది వారి కుట్రలా కనిపిస్తోందని అనుమానించారు. మరోవైపు, ఠాక్రే సేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రని మణిపూర్లా చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఠాక్రే సేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా ఇది బీజేపీ కుట్ర అంటూ ఆరోపించారు.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!