Jharkhand: 12 రోజుల్లో 16 మందిని చంపిన ఏనుగు.. 144 సెక్షన్ విధింపు..
Elephant Kills 16 People In 12 Days: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఏనుగు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఏకంగా 12 రోజల్లో 16 మందిని చంపేసింది. మంగళవారం ఒక్క రాంచీ జిల్లాలోని నలుగురిని చంపేసింది. దీంతో ఇట్కీ బ్లాకులో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూదని హెచ్చరించారు. ఇట్కీ బ్లాకులో గ్రామస్తులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఏ ఏనుగు దగ్గరికి వెళ్లవద్దని డివిజనల్ అటవీ అధికారి శ్రీకాంత్ వర్మ తెలిపారు.
గత 12 రోజుల్లో హజారీబాగ్, రామ్గఢ్, ఛత్రా, లోహర్దగా, రాంచీ జిల్లాల్లో 16 మందిని చంపినట్లు అనుమానిస్తున్న ఏనుగును పట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన నిపుణుల బృందాన్ని నియమించిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికర్ సామంత వెల్లడించారు. రాంచీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నేతృత్వంలో నాలుగు డివిజన్ల అటవీ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని, మొత్తం 16 మందిని ఒకే ఏనుగు చంపిందా అని కమిటీ నిర్ధారిస్తుందని అన్నారు.
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
Read Also: Joe Biden: ఉక్రెయిన్పై రష్యా ఎప్పటికీ విజయం సాధించదు..
సోమవారం లోహర్దగా జిల్లాలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని, ఆదివారం ఒకరిని ఏనుగు తొక్కి చంపింది. సోమవారం రాత్రి రాజధాని రాంచీకి 25 కిలోమీటర్ల దూరంలో ఇట్కీ బ్లాక్లోకి ప్రవేశించిందని, మంగళవారం ఉదయం ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారని, ఒకరికి గాయాలు అయ్యాయని అటవీ అధికారులు వెల్లడించారు. 12 రోజుల క్రితం ఇదే ఏనుగు హజారీబాగ్లో ఐదుగురిని చంపి, ఆపై రామ్గఢ్కు ప్రాంతానికి వెళ్లిందని.. అక్కడ గోలా ప్రాంతంలో ఒక వ్యక్తిని తొక్కేసి చంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 3.75 లక్షల పరిహారం ఇస్తామని.. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25,000 అందిస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. 2021-22లో ఏనుగు దాడుల్లో 133 మంది చనిపోయారని, 2020-21లో 84 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 2017 నుంచి ఐదేళ్ల వ్యవధిలో 462 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో