Jharkhand: 12 రోజుల్లో 16 మందిని చంపిన ఏనుగు.. 144 సెక్షన్ విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephant Kills 16 People In 12 Days: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఏనుగు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఏకంగా 12 రోజల్లో 16 మందిని చంపేసింది. మంగళవారం ఒక్క రాంచీ జిల్లాలోని నలుగురిని చంపేసింది. దీంతో ఇట్కీ బ్లాకులో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూదని హెచ్చరించారు. ఇట్కీ బ్లాకులో గ్రామస్తులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఏ ఏనుగు దగ్గరికి వెళ్లవద్దని డివిజనల్ అటవీ అధికారి శ్రీకాంత్ వర్మ తెలిపారు.
గత 12 రోజుల్లో హజారీబాగ్, రామ్గఢ్, ఛత్రా, లోహర్దగా, రాంచీ జిల్లాల్లో 16 మందిని చంపినట్లు అనుమానిస్తున్న ఏనుగును పట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన నిపుణుల బృందాన్ని నియమించిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికర్ సామంత వెల్లడించారు. రాంచీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నేతృత్వంలో నాలుగు డివిజన్ల అటవీ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని, మొత్తం 16 మందిని ఒకే ఏనుగు చంపిందా అని కమిటీ నిర్ధారిస్తుందని అన్నారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Joe Biden: ఉక్రెయిన్పై రష్యా ఎప్పటికీ విజయం సాధించదు..
సోమవారం లోహర్దగా జిల్లాలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని, ఆదివారం ఒకరిని ఏనుగు తొక్కి చంపింది. సోమవారం రాత్రి రాజధాని రాంచీకి 25 కిలోమీటర్ల దూరంలో ఇట్కీ బ్లాక్లోకి ప్రవేశించిందని, మంగళవారం ఉదయం ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారని, ఒకరికి గాయాలు అయ్యాయని అటవీ అధికారులు వెల్లడించారు. 12 రోజుల క్రితం ఇదే ఏనుగు హజారీబాగ్లో ఐదుగురిని చంపి, ఆపై రామ్గఢ్కు ప్రాంతానికి వెళ్లిందని.. అక్కడ గోలా ప్రాంతంలో ఒక వ్యక్తిని తొక్కేసి చంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 3.75 లక్షల పరిహారం ఇస్తామని.. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25,000 అందిస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. 2021-22లో ఏనుగు దాడుల్లో 133 మంది చనిపోయారని, 2020-21లో 84 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 2017 నుంచి ఐదేళ్ల వ్యవధిలో 462 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!