Jharkhand: 12 రోజుల్లో 16 మందిని చంపిన ఏనుగు.. 144 సెక్షన్ విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephant Kills 16 People In 12 Days: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఏనుగు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఏకంగా 12 రోజల్లో 16 మందిని చంపేసింది. మంగళవారం ఒక్క రాంచీ జిల్లాలోని నలుగురిని చంపేసింది. దీంతో ఇట్కీ బ్లాకులో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూదని హెచ్చరించారు. ఇట్కీ బ్లాకులో గ్రామస్తులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఏ ఏనుగు దగ్గరికి వెళ్లవద్దని డివిజనల్ అటవీ అధికారి శ్రీకాంత్ వర్మ తెలిపారు.
గత 12 రోజుల్లో హజారీబాగ్, రామ్గఢ్, ఛత్రా, లోహర్దగా, రాంచీ జిల్లాల్లో 16 మందిని చంపినట్లు అనుమానిస్తున్న ఏనుగును పట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన నిపుణుల బృందాన్ని నియమించిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికర్ సామంత వెల్లడించారు. రాంచీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నేతృత్వంలో నాలుగు డివిజన్ల అటవీ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని, మొత్తం 16 మందిని ఒకే ఏనుగు చంపిందా అని కమిటీ నిర్ధారిస్తుందని అన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Joe Biden: ఉక్రెయిన్పై రష్యా ఎప్పటికీ విజయం సాధించదు..
సోమవారం లోహర్దగా జిల్లాలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని, ఆదివారం ఒకరిని ఏనుగు తొక్కి చంపింది. సోమవారం రాత్రి రాజధాని రాంచీకి 25 కిలోమీటర్ల దూరంలో ఇట్కీ బ్లాక్లోకి ప్రవేశించిందని, మంగళవారం ఉదయం ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారని, ఒకరికి గాయాలు అయ్యాయని అటవీ అధికారులు వెల్లడించారు. 12 రోజుల క్రితం ఇదే ఏనుగు హజారీబాగ్లో ఐదుగురిని చంపి, ఆపై రామ్గఢ్కు ప్రాంతానికి వెళ్లిందని.. అక్కడ గోలా ప్రాంతంలో ఒక వ్యక్తిని తొక్కేసి చంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 3.75 లక్షల పరిహారం ఇస్తామని.. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25,000 అందిస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. 2021-22లో ఏనుగు దాడుల్లో 133 మంది చనిపోయారని, 2020-21లో 84 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 2017 నుంచి ఐదేళ్ల వ్యవధిలో 462 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!