CPI Raja: ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి.. దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI D Raja Sensational Comments On BJP and RSS: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. గవర్నర్ ఆఫీస్లను వినియోగించి.. తమ అజెండాను అమలు చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరిలో అదే జరుగుతోందన్నారు. ఆ రాష్ట్రాల్లోని గవర్నర్లు నామినేట్ చేసిన వ్యక్తులని.. గవర్నర్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగాలన్నది ఆర్ఎస్ఎస్ విధానమని.. ఈ రెండు ఎన్నికల్ని ఒకేసారి జరపడంపై జాతీయ లా కమీషన్ తమ అభిప్రాయం కోరిందని.. ఇది కచ్ఛితంగా సాధ్యం కాని విధామని తేల్చి చెప్పారు.
Chintamaneni Prabhakar: నా చొక్కా చింపేసిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..!!
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
మనది మల్టీ పార్టీ విధానమని, రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలని ఉందని డీ. రాజా పేర్కొన్నారు. అయితే.. మోడీ ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా ఆయన స్పందించారు. ఇది ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు కాదని, భిన్నాభిప్రాయాలతో కూడిన జడ్జిమెంట్ అని అభిప్రాయపడ్డారు. అత్యుత్తమ రాజ్యాంగ సంస్థ అయిన పార్లమెంట్లో కూడా దీనిపై సంప్రదించలేదని మండిపడ్డారు. నోట్ల రద్దుకు మోడీ చెప్పిన ఏ ఒక్క రీజన్ సరిగ్గా అమలు కాలేదన్నారు. ఉగ్రవాదులకు నిధులు, అవినీతి, తదితర అంశాలేవీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు పేదవారిపై తీవ్ర ప్రభావం చూపిందని.. ఆ టైంలో పేదవాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని ఉద్ఘాటించారు.
Big Breaking….Drugs Case: డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో ఇద్దరు అరెస్ట్
అంతకుముందు కూడా డీ. రాజా బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం వినాశనమవుతుందని బాంబ్ పేల్చారు. తొలిసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టినప్పుడు కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారని.. కానీ అందుకు భిన్నంగా మోడీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ, నిరంకుశ విధానాలను అమలు పరుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని వినాశనం దిశగా మోడీ తీసుకుపోతున్నారని మండిపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థలను పరిరక్షించుకోవాలంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలయికను 2024 ఎన్నికల్లో తప్పక ఓడించాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!