CPI Raja: ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి.. దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI D Raja Sensational Comments On BJP and RSS: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. గవర్నర్ ఆఫీస్లను వినియోగించి.. తమ అజెండాను అమలు చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరిలో అదే జరుగుతోందన్నారు. ఆ రాష్ట్రాల్లోని గవర్నర్లు నామినేట్ చేసిన వ్యక్తులని.. గవర్నర్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగాలన్నది ఆర్ఎస్ఎస్ విధానమని.. ఈ రెండు ఎన్నికల్ని ఒకేసారి జరపడంపై జాతీయ లా కమీషన్ తమ అభిప్రాయం కోరిందని.. ఇది కచ్ఛితంగా సాధ్యం కాని విధామని తేల్చి చెప్పారు.
Chintamaneni Prabhakar: నా చొక్కా చింపేసిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..!!
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
మనది మల్టీ పార్టీ విధానమని, రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలని ఉందని డీ. రాజా పేర్కొన్నారు. అయితే.. మోడీ ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా ఆయన స్పందించారు. ఇది ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు కాదని, భిన్నాభిప్రాయాలతో కూడిన జడ్జిమెంట్ అని అభిప్రాయపడ్డారు. అత్యుత్తమ రాజ్యాంగ సంస్థ అయిన పార్లమెంట్లో కూడా దీనిపై సంప్రదించలేదని మండిపడ్డారు. నోట్ల రద్దుకు మోడీ చెప్పిన ఏ ఒక్క రీజన్ సరిగ్గా అమలు కాలేదన్నారు. ఉగ్రవాదులకు నిధులు, అవినీతి, తదితర అంశాలేవీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు పేదవారిపై తీవ్ర ప్రభావం చూపిందని.. ఆ టైంలో పేదవాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని ఉద్ఘాటించారు.
Big Breaking….Drugs Case: డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో ఇద్దరు అరెస్ట్
అంతకుముందు కూడా డీ. రాజా బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం వినాశనమవుతుందని బాంబ్ పేల్చారు. తొలిసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టినప్పుడు కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారని.. కానీ అందుకు భిన్నంగా మోడీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ, నిరంకుశ విధానాలను అమలు పరుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని వినాశనం దిశగా మోడీ తీసుకుపోతున్నారని మండిపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థలను పరిరక్షించుకోవాలంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలయికను 2024 ఎన్నికల్లో తప్పక ఓడించాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!