Big Breaking….Drugs Case: డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు (Hyderabad Drugs Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేస్ లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త కృష్ణ కిషోర్ రెడ్డి తో పాటు ప్రముఖ డీజే మైరాన్ మోహిత్ ని అరెస్ట్ చేశారు. ప్రముఖ హీరోయిన్ భర్తనే మైరాన్ మోహిత్. టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న నేహా దేశ్ పాండే భర్త మైరాన్. 12 ఏళ్ల నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు మైరాన్. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ గా ఉన్నాడు మైరాన్. దేశవ్యాప్తంగా డీజేలు నిర్వహించడంలో మైరాన్ దిట్టగా పేరుంది. వంద మందికి పైగా డీజేలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మైరాన్.
గోవాతో పాటు దేశవ్యాప్తంగా డీజేలను ఆర్గనైజ్ చేస్తున్నాడు. డీజేలో మాటున డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మైరాన్. గోవా డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ తో మైరాన్ కు పరిచయాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ముంబై, గోవా, బెంగళూరు హైదరాబాదులోని పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మైరాన్..50 మందికి పైగా డ్రగ్ పెడ్లర్స్ తో అతనికి కీలక సంబంధాలున్నాయి. డబ్బుతో పాటు సన్ బర్న్ లో జరిగే పార్టీలకు డ్రగ్ సరఫరా చేస్తుంటాడు మైరాన్. టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు వ్యాపారవేత్తలతో అతనికి లింకులు వున్నాయి.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ముంబైలో మకాం వేసి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మైరాన్. టాలీవుడ్ నటి నేహా దేశ్పాండే ను వివాహం చేసుకున్నాడు మైరాన్. అతని కాంటాక్ట్ లిస్ట్ ను వెలికి తీస్తున్నారు పోలీసులు. మైరాన్ తో పాటు కృష్ణ కిషోర్ ని తిరిగి కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. గత కొంతకాలం నుంచి కృష్ణ కిషోర్ తో పరిచయాలు పెంచుకున్నాడు మైరాన్. బెంగళూరు గోవా మీదుగా హైదరాబాద్ కి డ్రగ్స్ తెప్పిస్తున్నాడు కృష్ణ కిషోర్ రెడ్డి. సూపర్ లగ్జరీ బస్సులో పార్సెల్ రూపంలో డ్రగ్స్ ని తీసుకువస్తున్నాడు కృష్ణ కిషోర్ రెడ్డి.
ఎడ్విన్, మైరాన్ తో కొంతకాలం నుంచి పరిచయాలు పెంచుకున్న కృష్ణ కిషోర్ రెడ్డి వారి సాయంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. తను వ్యాపారవేత్తలకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కె ఎం సి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న కృష్ణ కిషోర్ రెడ్డి. ప్రముఖ బిల్లర్ గా కొనసాగుతున్న కృష్ణ కిషోర్ రెడ్డి కార్యకలాపాలపై నిఘా వేశారు. తెలంగాణ ఏపీలో కాంటాక్టులు నిర్వహిస్తున్న కృష్ణ కిషోర్ రెడ్డిపై నిఘా పెంచారు. దర్యాప్తు ముమ్మరం చేస్తే మరిన్ని సంగతులు బయటకు వస్తాయంటున్నారు.
Read Also: Sanjay Bangar: సచిన్ను విరాట్ కోహ్లీ దాటేస్తాడు.. ఇది పక్కా..!!
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!