కరోనాతో అనాథలైన చిన్నారుల ఖాతాల్లో రూ.5 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి వరుసగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.. ఇప్పటికే ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చిన్నారుల్లో భరోసా నింపగా.. కేంద్రం కూడా మేమున్నామంటూ ధైర్యాన్ని చెపుతూ.. వారికి ఆర్థికసాయం ప్రకటించింది.. ఈ జాబితాలో మరో రాష్ట్రం కూడా చేరింది.. కరోనా ఫస్ట్ వేవ్తో పాటు సెకండ్ వేవ్ కూడా మహారాష్ట్రను అతలాకుతలం చేసింది.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడడమే కాదు.. పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారినపడి మృతిచెందారు. అయితే, కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర సర్కార్.. కోవిడ్తో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన పిల్లల ఖాతాల్లో రూ.రూ.5 లక్షల చొప్పున వేయాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, ప్రతీనెల రూ.1,125 భత్యం కూడా ఇవ్వనున్నారు.. ఎఫ్డీ చేసిన మొత్తాన్ని వారికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకునేందుకు వీలుకల్పించింది.. ఇదే సమయంలో.. తల్లి లేదా తండ్రిని మాత్రమే కోల్పోయిన చిన్నారులకు రూ.2,500 చొప్పున అందించాలని నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి యశోమతి ఠాకూర్ వెల్లడించారు. సీఎం ఉద్దవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు 162 మంది ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ మొత్తం… ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలకు అదనమని సీఎంవో ప్రకటించింది.. అనాథ పిల్లలు ప్రభుత్వం నడుపుతున్న వసతి గృహాల్లో లేదా వారి బంధువులతో కలిసి ఉండొచ్చని పేర్కొంది.. ఇక, మార్చి 1, 2020 తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కోవిడ్తో మరణిస్తే.. ఆ పిల్లలకు 18 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారే అర్హులు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
తాజావార్తలు
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..