కరోనాతో అనాథలైన చిన్నారుల ఖాతాల్లో రూ.5 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి వరుసగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.. ఇప్పటికే ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చిన్నారుల్లో భరోసా నింపగా.. కేంద్రం కూడా మేమున్నామంటూ ధైర్యాన్ని చెపుతూ.. వారికి ఆర్థికసాయం ప్రకటించింది.. ఈ జాబితాలో మరో రాష్ట్రం కూడా చేరింది.. కరోనా ఫస్ట్ వేవ్తో పాటు సెకండ్ వేవ్ కూడా మహారాష్ట్రను అతలాకుతలం చేసింది.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడడమే కాదు.. పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారినపడి మృతిచెందారు. అయితే, కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర సర్కార్.. కోవిడ్తో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన పిల్లల ఖాతాల్లో రూ.రూ.5 లక్షల చొప్పున వేయాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, ప్రతీనెల రూ.1,125 భత్యం కూడా ఇవ్వనున్నారు.. ఎఫ్డీ చేసిన మొత్తాన్ని వారికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకునేందుకు వీలుకల్పించింది.. ఇదే సమయంలో.. తల్లి లేదా తండ్రిని మాత్రమే కోల్పోయిన చిన్నారులకు రూ.2,500 చొప్పున అందించాలని నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి యశోమతి ఠాకూర్ వెల్లడించారు. సీఎం ఉద్దవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు 162 మంది ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ మొత్తం… ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలకు అదనమని సీఎంవో ప్రకటించింది.. అనాథ పిల్లలు ప్రభుత్వం నడుపుతున్న వసతి గృహాల్లో లేదా వారి బంధువులతో కలిసి ఉండొచ్చని పేర్కొంది.. ఇక, మార్చి 1, 2020 తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కోవిడ్తో మరణిస్తే.. ఆ పిల్లలకు 18 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారే అర్హులు.
Also Read
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!