TS Singh Deo: ప్రధానిపై సీఎం విమర్శలు, డిప్యూటీ సీఎం ప్రశంసలు.. కాంగ్రెస్ పార్టీకి ఎసరు పెడుతున్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Singh Deo: కాంగ్రెస్ నేత, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ప్రధాని నరేంద్రమోడీపై భారీగా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కేంద్ర చేపడుతున్న ప్రాజెక్టులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ‘క్రిటికల్ కేర్ బ్లాక్’లకు ప్రధాని మోడీ గురువారం శంకుస్థాపను చేశారు. వీటితో పాటు ప్రధాని అనేక భారీ ప్రాజెక్టులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డియో మాట్లాడుతూ.. మీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చలా ఇచ్చారని, భవిష్యత్తులో కూడా మీ సహకారం ఉంటుందని ఆయన ప్రధానిని ఉద్దేశిస్తూ అన్నారు. ప్రధాని ప్రకటించిన అన్ని ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేత ధన్యవాదాలు తెలిపారు. మేము కేంద్ర మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నామని, కేంద్రం నుంచి నిధులు అడగటానికి ఎలాంటి పక్షపాతంగా భావించనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని అన్నారు. ప్రధాని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి రూ. 6400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులను ప్రారంభించారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న టీఎస్ సింగ్ డియో, ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు కూడా ఇలాగే ఆయన ప్రధానిని ప్రశంసించారు. ఇప్పుడు చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్న భూపేష్ బఘేల్ కి, డియోకి పడదు. ఈ ఏడాది చివర్లలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఉన్నపలంగా డియోను కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎంగా నియమించింది.
2018లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం టీఎస్ డియో, భుపేష్ బఘేల్ మధ్య పోటీ నెలకొంది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం బఘేల్ వైపు మొగ్గు చూపింది. డియోకు ఆరోగ్యశాఖను కేటాయించింది. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న ఈ సమయంలో డిప్యూటీ సీఎం ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తుండటం కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు సీఎం బఘేల్ మాత్రం ప్రధానిని విమర్శిస్తున్నారు. ఇద్దరు కీలక నేతలు పరస్పరం ఇలా చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!