P Chidambaram: 2019 ఎన్నికల కన్నా 2024లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
P Chidambaram: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయని, 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో సీట్లు పెరుగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం శనివారం అన్నారు. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి అద్భుత విజయాలను సాధిస్తుందని జోస్యం చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూయిజం, హిందువులు ప్రమాదంలో ఉన్నారని చూపడం బీజేపీ వ్యూహమని, దీనికి ప్రతిపక్షాలను ‘‘హిందూ వ్యతిరేకులు’’గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కీలకమని అభివర్ణించారు.
Read Also: Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడిని “విలువైన ఆస్తి”గా పరిగణిస్తున్న ఐఎస్ఐఎస్
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
‘‘నేను అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడటలేను, తమిళనాడులో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకంగా ఉంది. కేరళలో రెండు పక్షాలు(యూడీఎఫ్, ఎల్డీఎఫ్)లు 20 సీట్లను గెలుచుకుంటాయి. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాదరణ పొందాయి. 2019 కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి’’ అని ఆయన అన్నారు. 2019లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది.
కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీల్లో ఇండియా కూటమికి సానుకూల నివేదికలు ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని, హిందూ వ్యతిరేకులుగా పీఎం మోడీ ప్రచారం చేయడం బీజేపీ ఎన్నికల వ్యూహమని ఆయన చెప్పారు. హిందూయిజం ప్రమాదంలో లేదని చెప్పారు. కచ్చతీవు దీవి వివాదం ముగిసిపోయిందని, ఎన్నికల సమయంలో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తడం ఏంటని చిదంబరం ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు..? అని అడిగారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!