Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడిని “విలువైన ఆస్తి”గా పరిగణిస్తున్న ఐఎస్ఐఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru cafe blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారిని నిన్న పశ్చిమబెంగాల్ నుంచి అరెస్ట్ చేశారు. అరెస్టైన్ అబ్దుల్ మతీన్ తాహాని ‘‘ అత్యంత విలువైన ఆస్తి’’గా ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మార్చి 1న కేఫ్లో బాంబు పెట్టిన తాహా మరియు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్లను కోల్కతా సమీపంలోని వారి రహస్య స్థావరం నుండి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శుక్రవారం అరెస్టు చేసింది. శనివారం వీరిద్దరిని కోర్టులో హాజరుపరచగా.. వీరికి 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. శుక్రవారం అర్థరాత్రి బెంగళూర్ తీసుకువచ్చి మడివాడాలోని డిటెన్షన్ సెల్కి తరలించారు.
READ ALSO: Bournvita: “బోర్న్విటా”ని హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలి.. కేంద్రం కీలక ఆదేశాలు..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఇద్దరు నిందితులను విచారించడంతో పాటు నిందితులను పేలుడు జరిగిన ప్రదేశంతో పాటు బెంగళూర్, చెన్నైలోని వారు బస చేసిన ప్రదేశానికి తీసుకెళ్లి స్పాట్ ఇంక్వెస్ట్ నిర్వహించారు. గత 5 ఏల్లుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రాడార్లో అబ్దుల్ మతీన్ తాహా ఉన్నాడు. బెంగళూర్ పేలుడుకు ఇతనే ప్లాన్ చేశాడు. నవంబర్ 2022లో మంగళూరులో జరిగిన ఐఎస్ ప్రాయోజిత ప్రెషర్ కుక్కర్ బాంబు పేలుడు, 2022లో శివమొగ్గ ట్రయల్ పేలుళ్లు మరియు 2020లో అల్ హింద్ మాడ్యూల్ కేసుతో తాహాకు సంబంధం ఉంది. అతనికి ఒక ‘‘కల్నల్’’ అనే వ్యక్తితో సంబంధం ఉందని, ఇతని పేరు దక్షిణ, మధ్య భారతదేశంలో అంతటా అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది.
వీరిద్దరికి కల్నల్తో సంబంధం, అతనితో ఎన్ని సమావేశాలు జరిగాయి, ఉగ్రవాద కార్యకలాపాలకు చెల్లింపు విధానం, భవిష్యత్ ప్రణాళికలపై ప్రశ్నించాలని ఎన్ఐఏ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. తాహా, ముస్సావిర్ హుస్సేన్ తమిళనాడుకు ఎలా తప్పించుకున్నారనే విషయాలను కూడా ఎన్ఐఏ రాబడుతోంది. కేఫ్ వద్ద బ్లైండ్ స్పాట్స్లని అర్థం చేసుకునేందుకు తాహా ఒక వారం పాటు రెక్కీ నిర్వహించాడు. రెండు వారాల క్రితం అరెస్టైన మరో నిందితుడు ముజమ్మిల్ షరీఫ్ తాహా కోసం హోటల్, నగరం నుంచి ఎలా వెళ్లాలనే దానిపై ప్రత్యేక మార్గాలను రూపొందించాడు. అయితే, బెంగాల్లో పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్ పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారా..? లేదా సరిహద్దు అవతలి వైపు నుంచి ఎవరైనా వీరికి సహాయం చేస్తున్నారా..? అనే విషయాలపై దర్యాప్తు జరుగుతోందని కర్ణాటక హోం మినిస్టర్ పరమేశ్వర అన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!