Kolkata rape-murder Case: మమతా బెనర్జీకి ‘‘లై డిటెక్టర్ టెస్ట్’’ నిర్వహించాలి
- మమతా బెనర్జీకి పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించాలి..
- కోల్కతా డాక్టర్ కేసులో బీజేపీ డిమాండ్..
- మమతా ఓ నియంత అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata rape-murder Case: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన దారుణ ఘటన యావత్ దేశాన్ని షాక్కి గురిచేస్తోంది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రేపు బెంగాల్ బంద్కి బీజేపీ పిలుపునిచ్చింది.
ఈ ఘటనలో నిందితులకు సీఎం మమతా బెనర్జీ రక్షణ కల్పిస్తున్నారని బీజేపీ మంగళవారం ఆరోపించింది. సీబీఐ ఆమెకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. కోల్కతాలో జరిగిన ఆందోళనల్లో నిరసరకారులపై లాఠీచార్జిపై స్పందించిన బీజేపీ.. మమతా బెనర్జీని నియంతగా అభివర్ణించింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: J P Nadda: “వాహ్..దీదీ.. రేపిస్టులకు సాయం చేయడం గౌరవం?.. మహిళల భద్రతపై ప్రశ్నించడం నేరమా?”
కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్కి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. నిరసనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని ఖండించింది. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా ఆందోళనకరమే అని, ఇది రాజ్యాంగాన్ని ముక్కలు చేయడం లాంటిదని అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా న్యూఢిల్లీలో ఆరోపించారు. అత్యాచారం, హత్యని ఆత్మహత్యగా పోలీస్ కమిషనర్ పేర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. రాజీనామా3 చేసి విచారణ ఎదుర్కోవాలని అన్నారు. నిజం బయటకు రావాలని, ఈ కేసును సీబీఐ విచారిస్తోందని, మమతా బెనర్జీ, పోలీస్ కమిషనర్కి పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించాలని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, ‘నబన్న అభిజన్’ ర్యాలీలో శాంతియుతంగా పాల్గొన్న వారిపై పోలీసులు “క్రూరమైన అణచివేత”కి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ను రాష్ట్ర పరిపాలనా దౌర్జన్యాలు ఆపకుంటే అడ్డుకుంటామని చెప్పారు. సంత్రాగచ్చిలో శాంతియుత నిరసనకారులపై పోలీసులు వాటర్ క్యానర్లు ప్రయోగిస్తున్నారని, హౌరా బ్రిడ్జి వద్ద విద్యార్థులపై టియర్ గ్యాస్ పేల్చారని దయచేసి వెంటనే ఈ క్రూరత్వాన్ని వెంటనే ఆపాలని ఆయన కోరారు. పోలీసు కమిషనర్ వినీత్ గోయల్, డీజీపీ ఇటువంటి క్రూరత్వాన్ని ఆపకపోతే, మేము ఖాళీగా కూర్చోమని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!