ఈ ఘటనలో నిందితులకు సీఎం మమతా బెనర్జీ రక్షణ కల్పిస్తున్నారని బీజేపీ మంగళవారం ఆరోపించింది. సీబీఐ ఆమెకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. కోల్కతాలో జరిగిన ఆందోళనల్లో నిరసరకారులపై లాఠీచార్జిపై స్పందించిన బీజేపీ.. మమతా బెనర్జీని నియంతగా అభివర్ణించింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ పంపిన రహస్య లేఖను స్వీకరించేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కార్యాలయం తిరస్కరించిందని రాజ్భవన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. బుధవారం మహిళా వైద్యురాలి తల్లిదండ్రులను గవర్నర్ బోస్ కలిశారు.