Kolkata rape-murder Case: మమతా బెనర్జీకి ‘‘లై డిటెక్టర్ టెస్ట్’’ నిర్వహించాలి
- మమతా బెనర్జీకి పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించాలి..
- కోల్కతా డాక్టర్ కేసులో బీజేపీ డిమాండ్..
- మమతా ఓ నియంత అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata rape-murder Case: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన దారుణ ఘటన యావత్ దేశాన్ని షాక్కి గురిచేస్తోంది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రేపు బెంగాల్ బంద్కి బీజేపీ పిలుపునిచ్చింది.
ఈ ఘటనలో నిందితులకు సీఎం మమతా బెనర్జీ రక్షణ కల్పిస్తున్నారని బీజేపీ మంగళవారం ఆరోపించింది. సీబీఐ ఆమెకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. కోల్కతాలో జరిగిన ఆందోళనల్లో నిరసరకారులపై లాఠీచార్జిపై స్పందించిన బీజేపీ.. మమతా బెనర్జీని నియంతగా అభివర్ణించింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
Read Also: J P Nadda: “వాహ్..దీదీ.. రేపిస్టులకు సాయం చేయడం గౌరవం?.. మహిళల భద్రతపై ప్రశ్నించడం నేరమా?”
కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్కి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. నిరసనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని ఖండించింది. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా ఆందోళనకరమే అని, ఇది రాజ్యాంగాన్ని ముక్కలు చేయడం లాంటిదని అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా న్యూఢిల్లీలో ఆరోపించారు. అత్యాచారం, హత్యని ఆత్మహత్యగా పోలీస్ కమిషనర్ పేర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. రాజీనామా3 చేసి విచారణ ఎదుర్కోవాలని అన్నారు. నిజం బయటకు రావాలని, ఈ కేసును సీబీఐ విచారిస్తోందని, మమతా బెనర్జీ, పోలీస్ కమిషనర్కి పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించాలని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, ‘నబన్న అభిజన్’ ర్యాలీలో శాంతియుతంగా పాల్గొన్న వారిపై పోలీసులు “క్రూరమైన అణచివేత”కి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ను రాష్ట్ర పరిపాలనా దౌర్జన్యాలు ఆపకుంటే అడ్డుకుంటామని చెప్పారు. సంత్రాగచ్చిలో శాంతియుత నిరసనకారులపై పోలీసులు వాటర్ క్యానర్లు ప్రయోగిస్తున్నారని, హౌరా బ్రిడ్జి వద్ద విద్యార్థులపై టియర్ గ్యాస్ పేల్చారని దయచేసి వెంటనే ఈ క్రూరత్వాన్ని వెంటనే ఆపాలని ఆయన కోరారు. పోలీసు కమిషనర్ వినీత్ గోయల్, డీజీపీ ఇటువంటి క్రూరత్వాన్ని ఆపకపోతే, మేము ఖాళీగా కూర్చోమని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!