CM Pinarayi Vijayan: వయనాడ్ బాధితులను కేంద్ర సర్కార్ అవమానిస్తుంది..!
- కేంద్ర ప్రభుత్వంపై కేరళ ముఖ్యమంత్రి విజయన్ సీరియస్..
- వయనాడ్ పై కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ వ్యాఖ్యలకు పినరాయి విజయన్ కౌంటర్.. వయనాడ్ బాధితులను మోడీ నేతృత్వంలోని కేంద్రం అవమానిస్తుంది: సీఎం విజయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Pinarayi Vijayan: వయనాడ్ విషాదానికి అక్రమ మైనింగ్, అనుమతి లేని మానవ నివాసాలే కారణమంటూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేసిన కామెంట్స్ పై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. భూపేందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు వయనాడ్ బాధితులను అవమానించేలా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కేరళలోని కొండ ప్రాంతాలపై కనీస అవగాహన ఉన్న ప్రజలెవరూ అక్కడ నివసిస్తు్న్న ప్రజలను అక్రమ వలసదారులుగా పేర్కొనరని సీఎం చెప్పుకొచ్చారు.
Read Also: Dorababu Pendem: వైసీపీకి మరో షాక్.. పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా
Also Read
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
కాగా, కేంద్రమంత్రి ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా విపత్తులో ప్రభావితమైన ప్రజలను అవమానిస్తున్నారని సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. ఈ అనధికార స్థిరనివాసులు ఎవరు? కొండచరియలు విరిగిపడి చనిపోయిన ఎస్టేట్ కార్మికులా? లేక తమకున్న చిన్నపాటి భూముల్లో జీవించే సామాన్య ప్రజలా? అంటూ ప్రశ్నించారు. ఆ ప్రాంతాల్లో నివసాముండే ప్రజలను అనధికారులు అనే ముద్ర వేయలేవమని ముఖ్యమంత్రి విజయన్ చెప్పుకొచ్చారు.
Read Also: US arrests Pakistani: డొనాల్డ్ ట్రంప్ సహా మరికొందరి హత్యకు ప్లాన్ చేసిన పాకిస్థానీ..
అయితే, భారీ విషాదం నేపథ్యంలో లోతైన ఆలోచన, సమిష్టి కృషి అవసరమైన సమయంలో కొంత మంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని వినియోగించుకుంటున్నారు అని సీఎం విజయన్ మండిపడ్డారు. ఇక్కడి వాస్తవ పరిస్థితుల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. రాష్ట్రంలోని కొండ ప్రాంతాల వలసలకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు వయనాడ్ పై తప్పుడు ప్రచారం చేస్తుందో ఆన్సర్ చెప్పాలని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!