Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు సీబీఐ షాక్.. లంచం ఆరోపణలపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI questions former J&K Governor Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఆయనను ప్రశ్నించింది. కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో రెండు ఫైళ్లను క్లియర్ చేసేందుకు రూ.300 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏప్రిల్ నెలలో సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. మేఘాలయ గవర్నర్ గా ఉన్న ఆయన పదవీ కాలం అక్టోబర్ 4తో ముగిసిన తర్వాత విచారణ ప్రారంభం అయింది. ఆగస్ట్ 23, 2018 నుంచి అక్టోబర్ 30, 2019 మధ్య సత్యపాల్ మాలిక్ కాశ్మీర్ గవర్నర్ గా పనిచేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాంట్రాక్టులు, కిరు జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,200 కోట్ల విలువైన సివిల్ వర్క్ కాంట్రాక్టుల కేటాయింపులో గవర్నర్ సత్యపాల్ మాలిక్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుపై ఏప్రిల్ లోనే సీబీఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. మేఘాలయ గవర్నర్ గా పదవీ కాలం ముగిసిన నిన్న శనివారం విచారణ జరిపింది. తనను సీబీఐ పిలిచినట్లు.. కేసుకు సంబంధించిన వివరాలను తీసుకున్నారని.. తరుపరి విచారణ సమాచారం తెలియదని.. మాలిక్ చెప్పారు. శనివారం రోజు దీనికి రెండు రోజుల ముందు కూడా మాలిక్ ను సీబీఐ విచారించింది.
Also Read
- West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
గతంలో దీనిపై సత్యపాల్ మాలిక్ పలు వ్యాఖ్యలు చేశారు. 2021 రాజస్థాన్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నా పరిశీలనకు రెండు ఫైళ్లు వచ్చాయని.. నేను వాటిని ఆమోదిస్తే ఒక్కోదానికి రూ.150 కోట్లు లభిస్తాయని ఓ సెక్రటరీ చెప్పారని.. అయితే నేను కాశ్మీర్ కు ఐదు కుర్తాలతో వచ్చానని.. వాటితోనే తిరిగి వెళ్తానని చెప్పి ఆఫర్ తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. సత్యపాల్ మాలిక్ ఇటీవల పలు సందర్భాల్లో బీజేపీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై కేంద్రానికి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు.
2017లో బీహర్ గవర్నర్ గా, 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దు ఈయన హయాంలోనే జరిగింది. మీరట్ విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు మాలిక్. 1974లో ఎమ్మెల్యే అయ్యారు. 1984లో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆయన భోఫోర్స్ కుంభకోణం తరువాత రాజీనామా చేశారు. 1988 వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ లో చ ేరారు. 1989లో అలీఘర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2004లో బీజేపీలో చేరారు ఆయన. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. ఆ తరువాత పలు రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలు అందించారు.
తాజావార్తలు
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!