Delhi: ఆప్కి భారీ షాక్.. బీజేపీలో చేరిన కౌన్సిలర్లు..
- ఆప్కి భారీ షాక్..
- బీజేపీలో చేరిన ఆ పార్టీ కార్పొరేటర్లు..
- ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే, తాజాగా ఆ పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్కి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఈ రోజు బీజేపీలో చేరారు. బీజేపీ అగ్ర నేతలు రాంవీర్ సింగ్ బిధూరి, అరవిందర్ సింగ్ లవ్లీ, యోగేంద్ర చందోలియా సమక్షంలో వారంతా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఆప్కి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన కార్పొరేటర్లలో బవానాలోని షహబాద్ డెయిరీ (వార్డ్ నంబర్ 28) నుండి రామ్ చంద్ర, బవానాలోని వార్డు నంబర్ 30 నుండి పవన్ సెహ్రావత్, బదర్పూర్ వార్డు నంబర్ 180 నుండి మంజు నిర్మల్, వార్డు నంబర్ 178 నుండి సుగంధ బిధురి ఉన్నారు. తుగ్లకాబాద్, హర్కేష్ నగర్లోని వార్డు నంబర్ 177కు ప్రాతినిధ్యం వహిస్తున్న మమత పవన్ ఉన్నారు.
Read Also: Ram Mohan Naidu: మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తారు..
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ పనితీరుపై అసంతృప్తితో ఉన్న నాయకులు ఈ రోజు మా పార్టీలో చేరారని, దేశాభివృద్ధికి ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి పనుల నుంచి స్పూర్తి పొందారని, ఢిల్లీ అభివృద్ధికి ఆప్ అడ్డంకులు సృష్టిస్తున్న తీరుపై వారంతా విసిగిపోయి ఉన్నారని అన్నారు.
2020 ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 62 స్థానాల్లో గెలిచింది. బీజేపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ కేసులో జైలులో ఉన్నాడు. మరోవైపు, 2024 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 8 ఎంపీ సీట్లలో ఆప్ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. బీజేపీ మొత్తం స్థానాలను క్లీన్స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో వరసగా ఆప్ పార్టీని నేతలు వీడుతుండటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీ అసెంబ్లీకి 2025లో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!