Howrah murder: జ్వరానికి క్యాన్సర్ మందులు.. ప్రియుడితో కలిసి భార్య దుర్మార్గం..
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
- సాధారణ జ్వరానికి క్యాన్సర్ మందులు..
- అవయవాల వైఫల్యంతో భర్త మృతి..
- డాక్టర్లకు అనుమానం రావడంతో వెలుగులోకి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Howrah murder: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. చాలా వరకు కేసుల్లో భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తల్ని హతమారుస్తున్నారు. క్షణకాలం సుఖాల కోసం హత్యలకు పాల్పడటం కాకుండా, పిల్లల్ని ఒంటరివాళ్లను చేస్తు్న్నారు. తాము ఎంతో తెలివిగలవారమని భావించి పక్కా ప్లాన్తో హత్యలు చేస్తున్నప్పటికీ, పోలీసుల నుంచి తప్పించుకోలేమనే నిజాన్ని మరిచిపోతున్నారు.
తాజాగా, ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కోల్కతా హౌరాలో ఓ మహిళ, తన భర్తను దారుణంగా హత్య చేసింది. భర్తకు వైరల్ ఫీవర్ రావడంతో జ్వరానికి వాడాల్సిన మందులకు బదులుగా ఆమె ఏకంగా క్యాన్సర్ చికిత్సలో వినియోగించే మందులను అందించి అతను మరణించేందుకు కారణమైంది. ఈ హత్యలో ఆమె ప్రియుడు ఫార్మసిస్ట్ హస్తం ఉంది. వీరిద్దర్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Also Read
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
- Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
Read Also: Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. మరో 6 నెలల తర్వాతే భూమి పైకి..
నసీమ్ సర్దార్ అనే వస్త్ర వ్యాపారి దాదాపుగా 3 వారాలుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు. అతని భార్య సహినా పర్విన్, అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బదులతో ఆమెతో సంబంధం ఉన్న స్థానిక ఫార్మాసిస్ట్ షేక్ మోర్సెలిమ్తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. వీరిద్దరు నసీమ్ జ్వరానికి క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చారు. దీంతో నసీమ్ పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతని అవయవాలు విఫలమై మరణించారు.
సాధారణ వైరల్ జ్వరానికి అవయవాలు విఫలం కావడం ఏంటనే అనుమానంతో డాక్టర్లు అనుమానించి, అతడికి ఇచ్చిన మందులు ఏంటని ప్రశ్నించారు. అయితే, అందుకు పర్విన్ అవన్నీ ఆయన వేసుకున్నాడని చెప్పింది. ఆ తర్వాత విచారణలో ఫార్మసిస్ట్ మోర్సెలిమ్ నోటి ద్వారా తీసుకునే కీమోథెరపీ మందుల్ని ఇచ్చినట్లు తేలింది. ఈ హత్యతో ఆగ్రహంలో ఉన్న స్థానికులు సహినపై దాడి చేశారు. మోర్సెలిమ్ ఇల్లు, ఫార్మసీ మరియు మోటార్సైకిల్ను ధ్వంసం చేసి తగులబెట్టారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, ఆర్ఏఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు.
తాజావార్తలు
-
Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
-
TIMS Jobs : టిమ్స్ సనత్నగర్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 3 నోటిఫికేషన్లు విడుదల
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
-
Bubble Gum: మనం సరదాగా నమిలే బబుల్ గమ్ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?