Howrah murder: జ్వరానికి క్యాన్సర్ మందులు.. ప్రియుడితో కలిసి భార్య దుర్మార్గం..
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
- సాధారణ జ్వరానికి క్యాన్సర్ మందులు..
- అవయవాల వైఫల్యంతో భర్త మృతి..
- డాక్టర్లకు అనుమానం రావడంతో వెలుగులోకి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Howrah murder: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. చాలా వరకు కేసుల్లో భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తల్ని హతమారుస్తున్నారు. క్షణకాలం సుఖాల కోసం హత్యలకు పాల్పడటం కాకుండా, పిల్లల్ని ఒంటరివాళ్లను చేస్తు్న్నారు. తాము ఎంతో తెలివిగలవారమని భావించి పక్కా ప్లాన్తో హత్యలు చేస్తున్నప్పటికీ, పోలీసుల నుంచి తప్పించుకోలేమనే నిజాన్ని మరిచిపోతున్నారు.
తాజాగా, ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కోల్కతా హౌరాలో ఓ మహిళ, తన భర్తను దారుణంగా హత్య చేసింది. భర్తకు వైరల్ ఫీవర్ రావడంతో జ్వరానికి వాడాల్సిన మందులకు బదులుగా ఆమె ఏకంగా క్యాన్సర్ చికిత్సలో వినియోగించే మందులను అందించి అతను మరణించేందుకు కారణమైంది. ఈ హత్యలో ఆమె ప్రియుడు ఫార్మసిస్ట్ హస్తం ఉంది. వీరిద్దర్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
Read Also: Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. మరో 6 నెలల తర్వాతే భూమి పైకి..
నసీమ్ సర్దార్ అనే వస్త్ర వ్యాపారి దాదాపుగా 3 వారాలుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు. అతని భార్య సహినా పర్విన్, అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బదులతో ఆమెతో సంబంధం ఉన్న స్థానిక ఫార్మాసిస్ట్ షేక్ మోర్సెలిమ్తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. వీరిద్దరు నసీమ్ జ్వరానికి క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చారు. దీంతో నసీమ్ పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతని అవయవాలు విఫలమై మరణించారు.
సాధారణ వైరల్ జ్వరానికి అవయవాలు విఫలం కావడం ఏంటనే అనుమానంతో డాక్టర్లు అనుమానించి, అతడికి ఇచ్చిన మందులు ఏంటని ప్రశ్నించారు. అయితే, అందుకు పర్విన్ అవన్నీ ఆయన వేసుకున్నాడని చెప్పింది. ఆ తర్వాత విచారణలో ఫార్మసిస్ట్ మోర్సెలిమ్ నోటి ద్వారా తీసుకునే కీమోథెరపీ మందుల్ని ఇచ్చినట్లు తేలింది. ఈ హత్యతో ఆగ్రహంలో ఉన్న స్థానికులు సహినపై దాడి చేశారు. మోర్సెలిమ్ ఇల్లు, ఫార్మసీ మరియు మోటార్సైకిల్ను ధ్వంసం చేసి తగులబెట్టారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, ఆర్ఏఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!